క్షణికావేశంలో కేవలం చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్న వైనం ఇప్పుడు ప్రపంచం లో ప్రతి మూలా చోటుచేసుకుంటోంది. బిర్యానీ కొనివ్వలేదని ఒక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చి మొత్తం భారతదేశాన్ని ఆశ్చర్యం లోనికి నెట్టింది. భర్త పై వచ్చిన చిన్న అలక చివరికి భార్య ప్రాణాలను బలి తీసుకుని 9 ఏళ్ళ కూతురు, 11 ఏళ్ళ కొడుకుని తల్లిని బిడ్డలుగా చేసింది.
తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని పుంజేరి లో మనోహరన్, శరణ్య అనే పేర్లు గల దంపతులు నివాసం ఉంటున్నారు. తనకు బిర్యానీ తినాలని ఉంది అంటూ తనకి కొనిపించాలని భార్య భర్తను కోరింది. అయితే లాక్ డౌన్ కావడంతో తన దగ్గర డబ్బు లేదని…. తర్వాత కొనిస్తా అంటూ నెమ్మదిగా భార్యకు నచ్చజెప్పి వెళ్లిపోయాడు మనోహరన్. అయితే ఏమైందో ఏమో ఒక్కసారిగా శరణ్య భర్త బైక్ లో నుండి కోపంగా పెట్రోల్ బాటిల్ లో తీసుకొని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది.
ఆత్మహత్యకు పాల్పడుతున్న శరణ్యను గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని… బిర్యానీయే కారణమా…? మరేదైనా ఉందా అనే కోణంలో భార్య, పిల్లల్నివేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు.