మనం నడుస్తున్నప్పుడు పక్కన ఏదైనా మురికి వాసన వచ్చినా ముక్కు మూసుుకుని దూరంగా నడుస్తుంటాము. అలాగే మురికి వాడల్లోకి వెళ్లాలంటేనే వామ్మో బ్యాడ్ స్మెల్ అంటూ బయపడుతాం.. ఇంకా చెప్పాలంటే ఎక్కడికైనా ముందుగా వద్దనుకునే ప్లేస్ ఏదైనా ఉందంటే అది మరుగుదొడ్డే నని అందరికీ తెలిసిన విషయమే.. అలాంటిది కట్టుకున్న భార్యనే ఏడాది పాటు మరుగుదొడ్డిలో బంధించిన ఓ కసాయి భర్తను మనిషనాలా లేక ఇంకేమైనా అనాలా..
‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవత’ అని సూక్తి. దీనర్థం ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడే దేవతలు కొలువుదీరుతారు. మన దేశంలో మహిళలకు గౌరవం దక్కుంతా… ఎలా మహిళలను గౌరవిస్తున్నారనే విషయం మనం రోజూ పేపర్లలో చూస్తూనే ఉన్నాము.
అదేలాగంటారా.. యాసిడ్ దాడిలో యువతి మరణం అనో, ప్రేమించలేదని యువకుని చేతిలో హతమైన మహిళ అనో, లేక నలుగురి చేతిలో లైంఘిక దాడికి బలైన యువతి అనో ఏదో ఒక విధంగా ఇలాంటి వార్తలు ప్రతి నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. తన తప్పు లేకపోయిన శిక్షను అనుభవించేది మాత్రం ఆడవారే. ఈ శిక్ష కట్టుకున్న భర్తల నుంచే ఎక్కువగా జరుగుతున్న విషయాలు మనం చూస్తూనే ఉన్నాము.
అలాంటిదే ఈ ఘటన కూడా. హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లా రిష్పూర్ లో తన భార్యపై కర్కషంగా వ్యవహరించిన తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రిష్పూర్ కు చెందిన బాధిత మహిళకు తన భర్త అయిన నరేశ్ కు 17 ఏండ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 15,13,11 ఏండ్ల ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. 35 ఏండ్ల తన భార్యను నరేశ్ మానసికంగా తను ఆరోగ్యంగా లేదని అందుకే టాయిలెట్ లో వేశానని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెను రక్షించారు.
అలాంటి దుర్భర పరిస్థితిలో ఉన్న భాదితురాలిని అధికారులు కాపాడి సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నరేశ్ పై మహిళా రక్షణ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో అతనికి ఐపీసీసీ సెక్షన్ 498 ఏ, 342 కింద కేసు నమోదు చేసుకున్నామని పోలీసు అధికారి సురేందర్ తెలిపారు.