Japan : ప్రపంచంలో పరిస్థితులు క్షణం క్షణం కి మారిపోతున్నాయి. ఇప్పటికే వైరస్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో పక్క కరోనా సెకండ్ వేవ్ ముంచు కొచ్చే ప్రమాదం ఉందని అంతర్జాతీయ మీడియా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇలాంటి తరుణంలో జపాన్ దేశంలో భారీ భూకంపం రావడంతో ఒక్కసారిగా
ఈ వార్త ప్రపంచాన్ని వణికించేసింది. ఆ దేశంలో ఈశాన్య తీరంలో దాదాపు రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు, సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ వాతావరణ సంస్థ. సరిగ్గా మియాగి ప్రాంతంలో ఉన్న సముద్రం 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆ దేశానికి చెందిన అధికారులు.