ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ ఈరోజు సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా చిన్నపిల్లలు యువతరం ఇది లేకుండా కాలం వెళ్లబుచ్చలేకపోతున్నారు. సాంకేతిక విప్లవం ఇండియాలో గ్రామాలను దాటి అడవులను సైతం తాకింది. అందులోనూ రిలయన్స్ జీఓ విప్లవం ఇంటర్నెట్ వినియోగంలో ఇండియా ను అగ్రస్థానంలో నిలిపింది. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన వెంటనే దీనిలో ఆదాయం వచ్చే మార్గాలను యువత అన్వేషించడం మొదలుపెట్టారు. దీనిలో కనిపించిందే యూట్యూబ్ చానల్స్. చాలా సులభంగా మొదలుపెట్టి అత్యంత సులభంగా డబ్బు సంపాదించే ఒక సాధనంగా యూట్యూబ్ ఛానల్స్ భారతీయ యువతకు ఆర్ధిక ఊతం ఇస్తున్నాయి. చానల్ వ్యూస్, సబ్స్క్రిబ్ లెక్కన డబ్బులు ఖాతాల్లోకి జమ చేసే యూట్యూబ్ లోని కొన్ని లొసుగులను పట్టుకొని భారతీయ యువత చేస్తున్న విచిత్రమైన అశ్లీలమైన కంటెంట్పై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి ఇంట్లోకి నేరుగా వెళ్లి పోయే కంటెంట్ లలో అశ్లీలత జుగుప్స కలిగించే అంశాలు ఉంటే కేంద్ర సమాచార శాఖ ఇకపై వీటిని నిషేధించనుంది.
యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టడం అంత సులభం కాదు!!
స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండి ఒక జిమెయిల్ అకౌంట్ ఉంటే చాలు యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి ఈ రోజుల్లో ఎక్కువైంది. వ్యూస్ కోసమో లేక సబ్ స్క్రిబ్ కోసమో కాకుండా తమ మనసులో ఉన్న భావాలను యథేచ్ఛగా యూట్యూబ్ లో పెట్టి ఆనందించే యువతరం ఎక్కువ అయ్యింది. ఈ అందించే క్రమంలో అశ్లీలత ఎక్కువ అవుతోంది. మాటల్లోనూ చేతల్లోనూ చిన్న పిల్లలు, మహిళల ను ఇబ్బంది పెట్టే అంశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు భారతీయ యూట్యూబ్ వీక్షకుల్లో ఇది అపరిమితంగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఇప్పుడు దీన్ని నిరోధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై యూట్యూబ్ చానల్స్ ను ఎవరు పడితే వారు నిర్వహించడానికి ప్రారంభించడానికి వీలులేకుండా ఒక కఠినమైన ఆర్డినెన్స్ను కేంద్ర ప్రభుత్వం తీసుకు రాబోతోంది. దీన్ని గూగుల్ కు అందించి యూట్యూబ్ ద్వారా తమ మార్గదర్శకాల మేరకు మాత్రమే చానల్స్ ను అనుమతించాలని కేంద్రం కోరనుంది. ఇది కనుక వెంటనే అమలు అయితే కొత్త యూట్యూబ్ చానల్స్ ప్రారంభానికి కాదు కొన్ని చానల్స్ నిర్వహన కష్ట తరమవుతుంది. ప్రతి యూట్యూబ్ ఛానల్ కంటెంట్ మీద కేంద్ర సమాచార శాఖ నిఘా ఉంచనుంది. సదరు కంటెంట్ లో ఏమైనా సెక్సువల్, జుగుప్సాకరమైన విషయాలు ఉంటే దాన్ని అనుమతించకుండా ఇండియా యూట్యూబర్ శాఖ ను ప్రభుత్వం కోరింది.
ఓటిటి పై అమలు సాధ్యమా??
యూట్యూబ్ ఛానల్ మీద కాకుండా ఓటిటి కంటెంట్ ఉన్న అంశం మీద కేంద్ర సమాచార శాఖ దృష్టిసారించింది. గతంలో సెన్సార్ బోర్డు అనుమతి మేరకే ఏ సినిమా అయినా విడుదల అయ్యేది. ఇప్పుడు దాన్ని దాటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో అన్ని సినిమాలను విడుదల చేస్తున్నారు దానికి ఎలాంటి అడ్డంకి ఉండటం లేదు. ఇకమీదట పోటీలో విడుదలయ్యే సినిమాల పైన కేంద్ర సమాచార శాఖ నిఘా ఉంటుంది. సదరు కంటెంట్లో సెక్సువల్ లేదా జుగుప్సా కరమైన అంశాలు ఉంటే దాన్ని వెంటనే నిరోధించేదెలా సమాచార శాఖ ప్రత్యేక టీమ్ దృష్టి సారిస్తుంది.
అతి అనర్ధమే
జాతీయ నేర గణాంక బ్యూరో రిపోర్టుల ప్రకారం.. జరుగుతున్న నేరాల్లో చాలావరకు ఇంటర్నెట్ సదుపాయం లేదా దానిలో చూసిన అంశాల ఆధారంగానే జరుగుతున్నట్లు కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అంటే జరుగుతున్న నేరాలకు ఇండియా లో యదేచ్ఛగా లభ్యమవుతున్న ఇంటర్నెట్ కు సంబంధం ఉందని కేంద్రం గమనించింది. అంటే వివిధ చానళ్లలో గాని ఓటిటి కంటెంట్ ద్వారా గాని నేర స్వభావం ఎక్కువగా పెరుగుతున్నట్లు కేంద్రం గుర్తించి ఈ చర్యలు తీసుకున్నట్లు గుర్తించాలి. యథేచ్ఛగా ప్రతి విషయాన్ని యూట్యూబ్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా యువతరానికి నిజంగా ముకుతాడు వేసినట్లే.