ఎన్నికలకు ముందు పులివెందులలో జరిగిన వైసిపి సీనియర్ పార్టీ నేత మరియు స్వయానా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకా హత్య కేసుపై విచారణని సిబిఐ బృందం వేగవంతం చేసింది. అసలీ కేసు సిబిఐ వారు చేతికి వెళ్లేందుకు చాలారోజులు పట్టగా దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని అభియోగాలు ఉన్నాయి. ఇక వరుసగా 8వ రోజు సిబిఐ తన విచారణ ను కొనసాగించింది.
ఇదే క్రమంలో నేడు సీబీఐ తన విచారణలో భాగంగా కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ని విచారించే అవకాశం ఉంది. ఈరోజు పులివెందుల లో కొంతమంది కీలక వ్యక్తులను విచారించనుండగా అలాగే వైఎస్ వివేకా సన్నిహితులు, కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రత్యర్ధులు మరియు లోకల్ పార్టీ లీడర్లు అందరూ సి.బి.ఐ ముందుకు వెళ్లి వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది.
ఇక పోతే నిన్న వివేక పీఏ కృష్ణారెడ్డి వాచ్ మెన్ రంగన్న మరియు అతని కుమారుడు ప్రకాష్ ని విచారించిన సిబిఐ బృందం కొంత ముఖ్యమైన సమాచారం సేకరించింది. గత రెండు రోజులుగా వివేక నివాస పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్న సీపీఐ మరియు సాంకేతిక నిపుణుల బృందం ఒక రిపోర్టును తయారు చేయడం మొదలు పెట్టారు.
ఇదిలా ఉండగా మొత్తం వివేకా హత్య కేసు విచారణ కోసం 25 మందికి పైగా సిబిఐ మరియు సాంకేతిక రంగాలకు చెందిన వారు రంగంలోకి దిగారు. ఈ విషయమై త్వరగా ఏదో ఒక కంక్లూజన్ వస్తుందని అటు వైసిపి పార్టీ వర్గాలతో పాటు ఇటు రాష్ట్ర ప్రజలు కూడా ఆశిస్తున్నారు.