yuvraj singh: క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలియనివారు ఎవరూ ఉండరు. ఒకప్పుడు ఇండియా టీం లో కీలకంగా రాణించిన యువరాజ్ 2011 వరల్డ్ కప్ భారత జట్టు గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ ఇలా ఆల్ రౌండర్ ప్రతిభ కనబరుస్తూ ఇండియా టైం లో అనేక మైలు రాళ్ళు సాధించడం జరిగింది. ముఖ్యంగా క్రీజులో ఉన్న టైంలో సిక్సర్ల మోత మోగించడంతో యువరాజ్ కి మించిన ప్లేయర్ ఎవరు ఉండరు. ఒక్కసారి క్రీజ్ లో నిలదొక్కుకుని ఉన్నాడు అంటే.. స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టాల్సిందే. అయితే ప్రస్తుతం అన్ని ఫార్మాట్లకు రిటైర్డ్ ఇచ్చిన యువరాజ్ సింగ్.. తాజాగా తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా వాసులకు మంచి హెల్ప్ చేశారు.
మేటర్ లోకి వెళ్తే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. చాలా మంది హాస్పిటల్స్ బెడ్ లేక మరణించిన సందర్భాలు గత నెలలో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నట్లు నిపుణులు హెచ్చరించడంతో చాలా మంది దాతలు దేశవ్యాప్తంగా ఆసుపత్రులకు రకరకాల పరికరాలు ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో యువరాజ్ సింగ్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తన ఫౌండేషన్ ద్వారా 125 ఐసియు బెడ్ లు సాయం అందించడం జరిగింది.
Read More: Corona: కరోనా థర్డ్ వేవ్ లో డేంజర్ డేస్ ఎప్పుడో తెలుసా?
మహమ్మారి కరోనా టైం లో అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో యువరాజ్ సింగ్ ఈ ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడున్నర కోట్ల తో తన ఫౌండేషన్ ద్వారా ఆసుపత్రిని నిర్మించడం జరిగింది తాజాగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి 125 కేటాయించడంతో నిజామాబాద్ వాసులు యువరాజ్ సింగ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.