వైఎస్సార్జిల్లా(కడప), జనవరి 17: భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన రద్దు అయినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తెలిపారు. గురువారం ఆయన వేంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కడప లో శుక్రవారం జరగాల్సిన పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటన రద్దు అయ్యిందని చెప్పారు. నిర్ణయించిన ప్రకారం సభ యధావిధిగా జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ సభలో కేంద్ర హోం మంత్రి రాజనాధ్ సింగ్, పార్టీ నేత రాం మాధవ్లు పాల్గొంటారని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు మాసాల్లో ఎన్నికలు పెట్టుకుని దొంగ శంకుస్థాపనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రాయలసీమ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ విషయం లో మెకాన్ సంస్థ కు సకాలంలో సరైన సమాధానం ఎందుకు ఇవ్వలేదు అని ఆయన ప్రశ్నించారు.
బాబు జీవితం మొత్తం మోసం ,అబద్దాలు చెప్తూ నీచ రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు.
తన కున్న మీడియా ను అడ్డం పెట్టుకొని తాను చెప్పేటటువంటి అబద్దాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, మేము చెప్పే నిజాలని మా గొంతులో నొక్కడం లో ఆయన మీడియా కూడా ప్రయత్నం చేస్తుందని ఆయన చెప్పారు.
కడప జిల్లా కు స్టీల్ ప్లాంట్ ఆలస్యం అవడానికి నూటికి నూరు పాళ్లు తెలుగుదేశం పార్టీ మోసపురితమైన ఆలోచనలు మాత్రమే అని ఆయన అన్నారు.
హైకోర్టు నిర్మాణం కోసం 2017 లో కేంద్రం500 కోట్ల రూపాయలు ఇస్తే బిల్డింగ్స్ రెడీ అని కేంద్రాన్నీ ,సుప్రీంకోర్టు ను తప్పు దోవ పట్టించారనీ ఆయన చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లబ్ది చేకూర్చడం కోసం విభజన చేసారని పిచ్చి కూతలు కూస్తున్న బాబూ మతి స్మితం లెకుండా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు.
వెనక్కి లాగే ప్రయత్నం చేశారు