శివకుమార్ ఇంట్లో స్వాధీనమని వీడియో
పాత, వేరే వీడియోలతో వైరల్ ప్రచారం
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్ ఇంట్లో భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఈ మేరకు రెండు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుప్పలు కుప్పలుగా పడి ఉన్న డబ్బుల కట్టలను అందులో చూపించారు. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ప్రాంతంలో శివకుమార్ ఇంట్లో దీన్ని స్వాధీనం చేసుకున్నారని అందులో చెప్పారు. ఏక్తా చౌహాన్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి దీన్ని పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి నిజమైన ముఖం కనపడుతోందన్నారు.
दिल्ली में कर्नाटक कोंग्रेस के मंत्री डी के शिवकुमार के दिल्ली सफदरजंग एन्क्लेव के बंगले पर छापा पड़ा है उसका वीडियो आपके साथ शेयर कर रहा हुँ ..
रुपये का गोदाम देखों और शेयर करों जिससे ?कांग्रेस का असली भृष्टाचारी चेहरा सामने आ सकें !!! pic.twitter.com/pTdux7CqTv— Ekta Chauhan (@EktaCha39299066) March 18, 2019
తమిళనాడు ఎమ్మెల్యే ఎస్పీ వేలుమణి పేరుతో కూడా వీడియో ప్రచారం కావడాన్ని ఆల్ట్ న్యూస్ వెబ్ సైట్ గుర్తించింది.
https://www.instagram.com/p/BuY7pTUlPPr/?utm_source=ig_embed
అయితే, అవన్నీ అసలు రూపాయలే కావు.. యూరోలు. అది కూడా స్పెయిన్ లో ఒక కళా ప్రదర్శన కోసం చేత్తో ముద్రించినవి. అలెజాండ్రో మాంగే అనే ఆ కళాకారుడు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కూడా ఈ వీడియోను పెట్టారు. తన కళాత్మక పనికి తప్పుడు క్లెయిములు వస్తున్నాయని అన్నారు. 2018లో ఆర్ట్ మాడ్రిడ్ అనే కళా ప్రదర్శనకు వచ్చిన ఓ విజిటర్ ఈ వీడియో తీశారని చెప్పారు. అందులో ఉన్న వివరాలు చెప్పకుండా ఒక డచ్ వెబ్ సైట్ దీన్ని ప్రచురించిందని తెలిపారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా హైతీ, రష్యా, కామెరూన్, స్పెయిన్, పాకిస్థాన్ లాంటి దేశాలలో తమ తమ రాజకీయ నాయకుల కథనాలకు దీన్ని వాడుకున్నారన్నారు. ఈ శిల్పాన్ని రెజీన్, చెక్కతో రూపొందించి, దాని మీద చేతులతో, రంగు పెన్సిళ్లతో రంగులు వేశామని తెలిపారు.
రెండో వీడియో..
https://www.facebook.com/vedanand.ojha.7/videos/440149186725455/
మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వస్తోంది. దాన్ని బీజేపీ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ఇంట్లో స్వాధీనం చేసుకన్న డబ్బని చెప్పారు. 2016లో ఢిల్లీలో రోహిత్ టాండన్ కు చెందిన టి అండ్ టి అనే న్యాయవాద కంపెనీపై సాగిన ఐటీ దాడుల వీడియోను ఇలా పెట్టారు. అప్పట్లో అధికారులు దాదాపు రూ. 13.48 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అదంతా పాత, కొత్త నోట్ల రూపంలో ఉంది. ఐటీ శాఖ, ఢిల్లీ క్రైంబ్రాంచి కలిసి ఆ దాడి చేశాయని ద టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక 2016 డిసెంబరు 12న పేర్కొంది.
Rs 2 cr in new notes recovered from a law firm in Greater Kailash is the highest reported from Delhi so far. @the_hindu @abaruah64
— Shiv Sunny (@shivsunny) December 10, 2016
వెనక్కి లాగే ప్రయత్నం చేశారు