కంగన నిర్మాతగా `అపరాజిత అయోధ్య` తెరకెక్కనుంది. ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ రాస్తున్నారు. అయోధ్య రామమందిరం కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కంగన మాట్లాడుతూ “నేను 80ల్లో పుట్టాను. నాలాగా 80ల్లో పుట్టిన చాలా మందికి అయోధ్య కేసు పట్ల ఆసక్తి ఉంటుంది. దేశ రాజకీయాలను మలుపుతిప్పిన కేసు అది. అందుకే ఆ కేసు పట్ల నాకు అంతటి అమితమైన ఆసక్తి ఉంది. నిర్మాతగా నా ప్రస్తానానికి ఈ కథ చాలా చక్కగా సరిపోతుందనిపించింది. నాస్తికురాలిగా మొదలైన ఓ అమ్మాయి జీవితం ఆస్తికత్వం పట్ల ఎలా ఆకర్షితమైందో ఈ చిత్రం నిరూపిస్తుంది“ అని అన్నారు. మణికర్ణిక చిత్రానికి కథ అందించిన విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథను సమకూరుస్తున్నారు. తలైవి చిత్రానికి కూడా ఆయనే కథను సమకూర్చారు. ఇప్పుడు కథను ఫైన్ ట్యూన్ చేసే పనుల్లో ఉన్నారు. ఇంకా దర్శకత్వం ఎవరు చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని తెరమీదకు తీసుకెళ్లనున్నారు.
వెనక్కి లాగే ప్రయత్నం చేశారు