NewsOrbit
Uncategorized టాప్ స్టోరీస్ న్యూస్

సచివాలయ భవనాల పనులకు శ్రీకారం

అమరావతి, డిసెంబరు27: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పాలనా నగర నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పరిపాలనా నగరంలోని అత్యంత కీలకమైన సచివాలయ భవనాలకు ర్యాఫ్ట్ ఫౌండేషన్‌ను కాంక్రీట్‌తో నింపే పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయపూడి దగ్గర గురువారం ప్రారంభించారు. ఐదు టవర్లుగా నిర్మించే సెక్రటేరియట్ కోసం భారీ ర్యాఫ్ట్ ఫౌండేషన్‌ను నిర్మించనున్నారు. భూమి ఉపరితలం నుంచి 13 అడుగుల లోతులో . 12వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌తో నాలుగు మీటర్ల మేర నిర్మించబోతున్నారు. రాజధాని ప్రాంత పరిధిలోని 41 ఎకరాల్లో 69 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఐదు భారీ టవర్ల కోసం ఈ ఫౌండేషన్‌ను స్థాపిస్తున్నారు. ఈ భారీ టవర్లలో నాలుగు 40 ఫ్లోర్స్, ఒకటి 50 ఫ్లోర్స్ గా నిర్మాణం చేయనున్నారు.
ర్యాఫ్ట్ ఫౌండేషన్ అంటే..
ఇది దేశంలోనే అతిపెద్ద నిర్మాణంగానిర్ణీత ప్రాంతం మొత్తాన్నీ కాంక్రీట్‌తో నింపే ప్రక్రియను ర్యాఫ్ట్ ఫౌండేషన్‌ విధానం అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే స్టీల్, కాంక్రీటుతో అత్యంత పటిష్ఠమైన, మందపాటి కాంక్రీట్‌ దిమ్మను పునాదిలో నిర్మించడమే. సాధారణంగా నేల లోతు నుంచి స్తంభాలు వేసి పునాది నిర్మించాలంటే అందుకు తగిన గుంతలు తవ్వాలి. బోర్లు వేసి స్టీలు పెట్టాలి. కాంక్రీట్‌ వెయ్యాలి. ఇందుకు కనీసం నెలన్నర వ్యవధి పడుతుంది. అదే ర్యాఫ్ట్ లో అయితే 3 రోజుల్లో పునాది వేయొచ్చు. ఫైల్‌ విధానంతో పోల్చితే దీనికి ఖర్చు ఎక్కువే. అయినా నిర్మాణం మాత్రం అత్యంత పటిష్ఠంగా ఉంటుంది.
రికార్డులకు
రాజధాని అమరావతి నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల అక్కడ నిర్మించే నిర్మాణాలన్నీ దశాబ్దాల పాటూ చెక్కు చెదరకుండా ఉండేలన్నది ప్రభుత్వధ్యేయం. అమరావతి నేల స్వభావానికి అనుగుణంగా భవన విస్తీర్ణం, ఎత్తుకు తగినట్లు పునాది ఎలా ఉండాలనేది తొలుత నిర్ణయించారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటిదాకా ఫైల్‌ ఫౌండేషన్‌ విధానంలో పనులు చేస్తున్నారు. సచివాలయం అత్యంత కీలక భవనం కావడంతో దానికి ర్యాఫ్ట్ ఫౌండేషన్‌లో పునాది వేస్తున్నారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ సచివాలయం కోసం ఆకృతుల్ని, నిర్మాణ ప్రణాళికల్ని సీఆర్‌డీఏకు ఇచ్చింది. కాంట్రాక్టరైన షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ ఐదు టవర్లను ఒకే ర్యాఫ్ట్‌పై నిర్మిస్తోంది. ఇందుకు వేలమంది కార్మికుల్ని, వందల సంఖ్యలో యంత్రాల్నీ ఉపయోగిస్తున్నారు. సచివాలయానికి సంబంధించి 5 టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,890 కోట్లు ఖర్చు చేయబోతోంది. 250 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన సచివాలయంగా నిర్మాణంగానున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా 50 అంతస్తుల టవర్లను నిర్మిస్తారు. ఇందుకోసం 60, 40 టన్నుల సామర్థ్యం ఉన్న క్రేన్లు, 10 మీటర్ల వరకు వాడే హైడ్రాస్‌, కాంక్రీట్‌ వేసే నాలుగు పంపులు, 30 ట్రాన్సిట్‌ మిక్సర్లను పనిలో పెట్టారు. మరో ఆరు మిక్సర్లను కూడా సిద్ధంగా ఉంచారు. ఈ నిర్మాణ పనులను ఏకధాటిగా 72 గంటల పాటు కాంక్రీటు పనులు జరుగనున్నాయి. ప్రపంచంలోనే 212 మీటర్ల ఎత్తైన సెక్రటేరియట్ భవనంగా నిలవనుంది.
ప్రత్యేకతలు
ఈ సెక్రటేరియట్‌కు హెలీకాప్టర్ ద్వారా చేరుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం పైభాగాన 15 ఫ్లోర్లో హెలీప్యాడ్‌ను నిర్మించనున్నారు.
ఈ సెక్రటేరియట్ 41 ఎకరాల్లో నిర్మిస్తారు
ఐదు టవర్ల ఏర్పాటు
మొత్తం 69.5లక్షల చదరపు మీటర్లు నిర్మాణం
నిర్మాణం అంచనా : 4వేల కోట్లు
టవర్ల నిర్మాణా ,2 షర్పోజి పల్లోంజి, 3,4 ఎల్అండ్ టి, 5వ టవర్ ఎన్.సి.సి

author avatar
Siva Prasad

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Leave a Comment