న్యూఢిల్లీ: ‘న్యాయ్’ (నిరుపేదలకు నగదు సహాయం పథకం) వాగ్దానం ద్వారా ఎన్నికలలో విజయం సాధిస్తామని ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే నినాదం కేంద్ర బిందువుగా ‘అబ్ హోగా న్యాయ్’ అన్న ఎన్నికల నినాదాన్నీ, పాటనూ విడుదల చేసింది.
ప్రముఖ హిందీ కవి జావేద్ అఖ్తర్ ర్యాప్ స్టైల్కు అనుగుణంగా ఈ పాట రాశారు. పెద్ద నోట్ల రద్దు, వ్యవసాయ రంగంలో సంక్షోభం వంటి అంశాలపై ఇందులో దృష్టి సారించారు. నిరుద్యోగం, గ్రామీణ ఆర్ధిక సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు ఈ పాటకు విషయాలు. ‘మైహీతో హిందూస్థాన్ హూ’ అంటూ నడిచే ఈ పాటలో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతా అంశాలైన పేదరికం నిర్మూలన, సగటు మనిషి సంక్షేమం కనబడతాయి.
ఇక్కడ పాట వీడియో చూడండి: