(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రైల్వే స్టేషన్లో ఒక మహిళ పాడిన పాటకు నెటిజన్లనుండి అనూహ్య స్పందన లభించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. వేలాది మంది ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ కామెంట్స్ ఇస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లోని రానాఘాట్ రైల్వేస్టేషన్లో ఒక మహిళ ప్రముఖ గాయని లతామంగేష్కర్ 1972 నాటి షోర్ చిత్రంలో ఆలపించిన ‘ఏక్ ప్యార్ క నగ్మ హై’ పాటను ఆమె మాదిరిగానే శ్రావమైన కంఠంతో పాడటం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియోను గత నెల 28న కిషన్ దాస్ జుబు అనే వ్యక్తి బార్పేట్ టౌన్ అనే ఫేస్బుక్ పేజీలో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో లక్షలాది మంది వీక్షించగా 39వేల మంది ప్రశంసల జల్లు కురిపిస్తూ కామెంట్స్ ఇచ్చారు. 35వేల మందికిపైగా వీడియోను షేర్ చేశారు.
https://www.facebook.com/krishaanDasZubu/videos/1262366750604317/