హైదరాబాద్: ఎల్బీనగర్ లో ఓ ట్రాఫిక్ పోలీస్ తన ఔదార్యాన్ని చాటాడు. వర్షపు నీటిలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న ఓ రోగిని తన బుజాలపై వేసుకుని రోడ్డు దాటించాడు. అతడు చేసిన పనికి స్థానికులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ఎల్బీనగర్ నుంచి సాగర్రింగ్రోడ్డుకు వెళ్లే దారిలో నడుములోతు నీరు నిలిచిపోయింది. అదేసమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడైన తండ్రితో కలిసి స్కూటీపై అటుగా వెళ్తున్న వ్యక్తి వర్షపు నీటిలో చిక్కుకున్నాడు. ఆయన తండ్రి కుడికాలుకి తీవ్రగాయం కావడంతో దానికి పట్టీకట్టి.. వానకు నానకుండా ప్లాస్టిక్ కవర్ చుట్టారు. అయితే, ఒడ్డుకు రావడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇది గమనించిన ఎల్బీనగర్ కూడలి వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగమల్లు.. వెంటనే అతని వద్దకు వెళ్లి స్వయంగా భుజంపై మోసుకుంటూ రోడ్డు దాటించాడు. అక్కడే ఉన్న కొంతమంది తమ మొబైల్లో ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది.
Lb nagar Traffic CI nagamallu assisting a person with disability at sagar ring road.@KTRTRS @RaoKavitha @HYDTP @hydcitypolice pic.twitter.com/4fEAwjAI2f
— Varun Thakkallapalli (@varuntrs58) August 30, 2019