(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జూపార్క్లో ఓ సింహం సందర్శకులను వెంబడిస్తూ చుక్కలు చూపించింది. మృగాలను తిలకిస్తున్న యువకులపై ఒక్కసారిగా సింహం దాడిచేయబోయింది. బతుకు జీవుడా అంటూ యువకులు వాహనం ఎక్కి యమస్పీడుతో వెళ్ళినా.. సింహం సఫారీ వాహనం వెంట పరుగులు దీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని అటల్ బిహారీ వాజ్పేయి జూపార్క్లోకి కొంతమంది యువకులు వెళ్లారు. ఓ సఫారీ వాహనంలో అక్కడి అందాలను చూస్తున్నారు. అయితే, అనుకోకుండా అదే సమయంలో కోపంతో ఉన్న ఓ మగ సింహం వారిని వెంబడించింది. యువకులు వాహనం వేగంతో వెళ్ళినా.. సింహం సఫారీ వాహనం వెంట పరుగులు తీయడం ఆపలేదు. దీంతో అప్రమత్తమైన జీప్ డ్రైవర్ వేగంగా తమ వాహనాన్ని నడిపాడు. అనంతరం కొంత దూరం వెళ్లి తమ వాహనాన్ని కాసేపు ఆపగా.. మళ్లీ ఆ సింహం వెంబడించింది. దీంతో యువకుల సరదా యాత్ర కాస్త సాహస యాత్రగా మారింది. సింహం వెంటాడే దృశ్యాలను యువకులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
https://youtu.be/YyhIbHP1RKk