(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేష్ బాబు, సినీ దర్శకుడు వంశీ పైడితల్లి కుమార్తెలు సితార, ఆద్య మంచి స్నేహితులు. వారు వారి పేర్లలోని మొదటి అక్షరాలు ఎ అండ్ ఎస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. మొదటి వీడియోగా త్రి మార్కర్స్ ఛాలెంజ్ పేరుతో ఒక వీడియోను రూపొందించారు.
చిన్నారులను ఆకట్టుకునేలా బొమ్మలకు రంగులు నింపడంలో సితార, ఆద్య పోటీలు పడటాన్ని చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఈ చిన్నారి స్నేహితుల కోసం మహేష్ బాబు కూడా ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయడంతో గంటల వ్యవధిలోనే పదివేలకు పైగా లైక్లు వచ్చాయి.
Some fun time for these little girls!!! Enjoy ur YouTube stint ♥♥ Wishing you two all the very BEST ???#AadyaSitara ?https://t.co/Do5SQfqa4j
— Mahesh Babu (@urstrulyMahesh) July 18, 2019