కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తరపున తొలిసారి లోక్సభకు ఎన్నికైన మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్లు ఓ ప్రత్యేక పాటకు నృత్యం చేశారు. దేశవ్యాప్తంగా వచ్చే నెలలో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దుర్గామాతను బెంగాల్ వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. దసరా వేడుకలను అక్టోబర్ 4 నుంచి 8వ తేదీ వరకు ఈ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బెంగాలీ సినీ నటులు, ఎంపీలు నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తితో ప్రత్యేక పాటను రూపొందించారు. దుర్గామాతను కొలుస్తూ బెంగాలీ భాషలో రూపొందించిన ‘ఆశే మా దుర్గా శే’ పాటకు ఎంపీలు నుస్రత్ జహాన్, మిమీ చకవ్రర్తి నృత్యం చేశారు. బెంగాలీ నటి సుభశ్రీ గంగూలీ కూడా నుస్రత్, మిమీలతో కలిసి ఈ వీడియోలో కనిపించింది. సోమవారం కెప్టెన్ టీఎంటీ ఈ పాటను ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఇప్పటి వరకు 1.6 మిలియన్ల మందికిపైగా ఈ వీడియోను వీక్షించారు.
https://www.facebook.com/captaintmtsteel/videos/516551492498014/