(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఓ లేడి న్యూస్ రీడర్ వార్తలు చదువుతుండగా.. ఆమె కుమారుడు డిస్ట్రబ్ చేశాడు. అయితే, అది లైవ్ కావడంతో ఆమె మాత్రం న్యూస్ చెప్పడం ఆపలేదు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఆ వివరాలలోకి వెళితే.. బుధవారం ఎంఎస్ఎన్బీసీ టీవీ స్టూడియోలో న్యూస్ రీడర్ కోర్ట్నీ కుబే.. ఉత్తర సిరియాలో వైమానిక దాడుల గురించి వార్తలు చదువుతోంది. ఈ సందర్భంగా ఆమె నాలుగేళ్ల కుమారుడు ర్యాన్ న్యూస్ రూమ్ లో వెనుక వైపు నుంచి వచ్చి.. ఆమె వద్దకు వెళ్లి.. లైవ్ లో అంతరాయం కలిగించాడు. దీంతో యాంకర్ కొంచం కంగారు పడింది. ‘నన్ను క్షమించండి, నా పిల్లలు ఇక్కడ ఉన్నారు. లైవ్ జరుగుతోంది’ అని నవ్వుకుంటూ కుబే లైవ్ లో పేర్కొంది. అయితే, ఆమె వార్తలు చెప్పడం మాత్రం ఆపలేదు. అనంతరం సిరియాకు సంబంధించిన మ్యాప్ ను స్క్రీన్ మీద చూపించారు. దీనికి సంబంధించిన వీడియోని ఎంఎస్ఎన్ బిసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2.3 మిలియన్ల మంది ఈ వీడియోని వీక్షించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
https://twitter.com/MSNBC/status/1181934431696760832
Kudos to the savvy producer in the control room who thought, "uh…now's probably a good time to run a graphic for a few seconds."
— Elliot Williams (@elliotcwilliams) October 9, 2019
@ckubeNBC showing the world how #workingmoms make it happen! #MSNBCMoms
— Katie S. Phang (@KatiePhang) October 9, 2019
Like a boss! Also, great teamwork on the graphic. Kids are the best.
— John Panzer (@jpanzer) October 9, 2019