నాగాలాండ్లో గుంతలో చిక్కుకున్న ఓ బోలెరో వాహనాన్ని మహిళ పోలీసులు బయటకు తీసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళా బెటాలియన్ సాహసంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా స్పందించారు. బొలెరో గుంతలో ఎలా పడిపోయిందో తెలియదు కానీ శక్తిమంతమైన మన నారీమణులు దాన్ని కాపాడారని అన్నారు. వారి శక్తి ఏంటో తెలిశాక కూడా నాగా మహిళా బెటాలియన్తో పెట్టుకునేంత మూర్ఖుడిని కాదు అంటూ ట్వీట్ చేశారు.
https://twitter.com/anandmahindra/status/1166537829444272128
ఇటీవల నాగాలాండ్ లో దట్టమైన అడవి గుండా నాగా మహిళా పోలీస్ బెటాలియన్ వెళ్తున్నది. అయితే, ఆ సమయంలో ఓ బొలెరో వాహనం గోతిలో ఇరుక్కుపోయింది. దీంతో ఆ వాహనాన్ని బయటకు తీసేందుకు ఎవరు లేకపోవడంతో అడవిలో అలాగే ఉండిపోయారు ఆ వాహనంలో ఉన్న వ్యక్తులు. అయితే, నాగా మహిళా బెటాలియన్కు చెందిన కొందరు మహిళా పోలీసులు కాల్వ గుంతలోకి దిగి వాహనాన్ని బలంగా పైకి నెట్టేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని ఎమ్మెల్యే మహోన్లునో కికన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ.. వీడియో పాతదే అయినా ఎక్కువ మంది చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్ర, కేంద్రమంత్రి కిరణ్ రిజుజులకు ట్యాగ్ చేశారు.