(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఓ పాకిస్థానీ న్యూస్ ఛానల్ నిర్వహించిన లైవ్ డిబేట్ లో ఓ విశ్లేషకుడు కుర్చీపై నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటన సెప్టెంబర్ 16న జీ టీవీలో చోటు చేసుకుంది. కశ్మీర్ కి సంబంధించిన అంశంపై సదరు టీవీ ఛానల్ చర్చ కార్యక్రమాన్ని నిర్వహించింది. డిబేట్ లో యాంకర్ తోపాటు మజహర్ బర్లాస్అనే విశ్లేషకుడు, ఓ మహిళ పాల్గొన్నారు. అయితే, లైవ్లో చర్చ కొనసాగుతుండగా డిబేట్ ప్యానెల్లో ఉన్న సీనియర్ విశ్లేషకుడు మజహర్ బర్లాస్ ఉన్నట్టుండి హఠాత్తుగా కుర్చీపై నుంచి కింద పడ్డారు. దీంతో డిబేట్ నిర్వహిస్తున్న యాంకర్ తో పాటు చర్చలో పాల్గొన్న మహిళ షాక్ కి గురయ్యారు. అయితే, న్యూస్ యాంకర్ మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. ఈ సందర్భంగా యాంకర్ నాలుక కరుచుకుంటూ చిత్రమైన భావాలు వ్యక్తీకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
@mazhar_barlas sir ap kay lagi tw nahi ziada ??@GTVNetworkHD jani wtf ? pic.twitter.com/iNY0Yfc7HM
— A S A D I S H A Q (@IamAsadIshaq) September 17, 2019
No matter which chair u r sitting in, its just a matter of time! https://t.co/rIbddkhpQ3
— MNS (@mnaveedsheikh) September 18, 2019
https://twitter.com/incognito681/status/1173843035915980800