(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రధాని మోదీని పిల్లలు దూషిస్తుంటే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వారిని వారించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన సోదరుడు రాహుల్ గాంధీ తరపున అమేఠీలో ప్రచారం చేస్తున్న ప్రియాంకకు మంగళవారం ఒకచోట కొందరు పిల్లలు ఎదురయ్యారు. ప్రియాంక ప్రచారానికి వస్తున్న కారణంగానే స్థానిక కాంగ్రెస్ నాయకులు వారిని తయారుచేశారు.
ప్రియాంక రాగానే పిల్లలంతా రాహుల్ తన ప్రసంగాల్లో పదేపదే అంటున్న మాట చౌకీదార్ చోర్ హై అని నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రియాంక నవ్వుతూ తల ఊపుతూ నుంచున్నారు. ఇంతలో పిల్లలు మోదీని ఉద్దేశించి ఒక తిట్టుమాట ప్రయోగించారు. వెంటనే కళ్లు పెద్దవి చేసిన ప్రియాంక వారిని వారించారు. ‘ఇది అనకూడదు. మంచి పిల్లలుగా ఉండండి’ అంటూ అక్కడ నుంచి నిష్క్రమించారు. పిల్లలు రాహుల్ గాంధీ జిందాబాద్ అనడం మొదలుపెట్టారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది. దీనికి రకరకాల స్పందనలు వచ్చాయి. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రియాంక పాపులారిటికి ఆమె ముక్కు తప్ప మరో అర్హత లేదని వ్యాఖ్యానించారు. ప్రియాంకలో కొట్టొచ్చినట్లు కనబడే నాయినమ్మ ఇందిరాగాంధీ పోలికలను ఉద్దేశించి ఆమె ట్విట్టర్లో ఇలా స్పందించారు.
పిల్లలు మోదీని నిందిస్తుంటే వెంటనే వారించినందుకు చాలామంది ప్రియాంకను అభినందించారు. ప్రియాంకను నిందిస్తూ స్మృతి ఇరానీ పోస్టు చేసిన వీడియోలో పిల్లలను వారించే భాగం లేకుండా పోవడం ట్విట్టర్ ఖాతాదారుల దృష్టిని దాటిపోలేదు. ఆప్ నాయకురాలు అల్కా లాంబా, ప్రియాంక స్పందనను ‘ఐ లవ్ హర్ రియాక్షన్’ అంటూ మెచ్చుకున్నారు.
వీడియో ఇక్కడ చూడండి
Uncouth to the core. Imagine the filthiest of abuses that a Prime Minister has to endure from people whose only claim to fame is a nose. Lutyens outrage anyone ???? https://t.co/T5sPyKtmbr
— Smriti Z Irani (@smritiirani) April 30, 2019