కోల్కతా: ప్రముఖ నటి, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ డబ్బు వాయించి అందరిని ఆశ్చర్యపరిచారు. పశ్చిమ బంగాల్లో దుర్గా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోల్కతాలో జరుగుతున్న దుర్గా నవరాత్రుల సందర్భంగా నుస్రత్ జహాన్ డ్రమ్స్ వాయించారు. సురుచి సంఘం ఏర్పాటు చేసిన మంటపంలో నుస్రత్ జహన్ ఆమె భర్త నిఖిల్ జైన్తో కలిసి సంప్రదాయ పద్దతిలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత మంటపంలో భర్త నిఖిల్ జైన్తో కలిసి కాసేపు అక్కడ సరదాగా డబ్బు వాయించారు. డ్రమ్స్ వాయిస్తూ అక్కడున్న వారిలో ఉత్సాహం నింపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#WATCH Kolkata: Trinamool Congress MP Nusrat Jahan and husband Nikhil Jain play the 'dhaak' at Suruchi Sangha. #DurgaPuja2019 pic.twitter.com/FFOaj4iyBA
— ANI (@ANI) October 6, 2019
ఇటీవల నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తితో కలిసి దుర్గా ఉత్సవాలపై ఓ పాటకు నృత్యం చేసిన సంగతి తెలిసిందే. దుర్గమ్మను ఆరాదిస్తూ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను బాగా ఆకట్టుకుంది. దీంతో ఆ వీడియో ఫేస్బుక్, యూట్యూబ్లో వైరల్గా మారింది.
నుస్రత్ జహాన్ ప్రముఖ వ్యాపార వేత్త నిఖిల్ జైన్ను ఈ ఏడాది జూన్ లో వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో టర్కీలో వీరి వివాహం జరిగింది. సినీ నటి అయిన నుస్రత్.. ఆ రంగాన్ని విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. లోక్ సభ జరిగిన ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు. పోటీ చేసిన మొదటిసారే లోక్సభ ఎంపీగా విజయం సాధించారు. బసిర్హట్ నియోజకవర్గం నుంచి నుస్రత్ గెలుపొందారు. సినిమా రంగం నుంచి వచ్చి అతి చిన్న వయసులోనే పార్లమెంటుకు ఎన్నికై రికార్డు సృష్టించారు. ముస్లిం అయిన ఆమె హిందూ సంప్రధాయ పద్దతిలో వచ్చి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తన మాట తీరుతో పార్లమెంట్ సమావేశాల్లో అదరగొట్టి అందరితో మన్ననలు పొందారు.
https://www.instagram.com/p/B3RISkQHUb-/?utm_source=ig_embed