హైదరాబాదు: మాఫియాకు మీడియాకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీడియానే విజయం సాధిస్తుందని టివి మాజీ సిఇఒ రవిప్రకాష్ అన్నారు.
సిసిఎస్ పోలీసుల విచారణ ఎదుర్కొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
టీవి9ను ఇద్దరు ధనికులు అక్రమంగా కొనుగోలు చేశారని రవిప్రకాష్ ఆరోపించారు. నాపై దొంగ కేసులు పెట్టారనీ, ధర్మం తన పక్షానే ఉందని రవిప్రకాష్ అన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా బోర్డ్ మీటింగ్ పెట్టుకొని తనను అక్రమంగా టివి9 నుంచి బయటికి పంపించారని రవిప్రకాష్ ఆరోపించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని రవిప్రకాష్ అన్నారు. ఈ యుద్ధంలో జర్నలిజమే గెలుస్తుందని రవిప్రకాష్ స్పష్టం చేశారు.
వీడియో కొరకు క్లిక్ చేయండి..