(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పట్టణ ప్రాంతాల్లోని ఇళ్లలోని మరుగుదొడ్లు, ఫ్రిజ్ ఇతర ప్రదేశాలకు పాములు రావడం చూశాం. కానీ తాజాగా ఉత్తరాఖండ్లోని ఒక సూపర్ ఫాస్ట్ రైలులోకి త్రాచు పాము (కింగ్ కోబ్రా) రావడం ప్రయాణీకులను ఆందోళనకు గురి చేసింది. రైలు కంపార్ట్మెంట్ తలుపుల దగ్గర వాగన్ చక్రాలపైన పది అడుగుల పొడవు త్రాచు పాము ఉండటాన్ని గమనించిన ప్రయాణీకులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, రైల్వే పోలీసులు అక్కడకు చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆ త్రాచు పామును సురక్షితంగా పట్టుకొని అడవిలో వదిలివేశారు.
రైలు చక్రాల వద్ద నక్కుకొని ఉన్న త్రాచుపామును ఆర్పిఎఫ్, ఫారెస్టు అదికారులు చాకచర్యంగా బయటకు తీసి బందిస్తున్న వీడియోను అటవీశాఖ ఫీల్డ్ ఫారెస్టర్ డాక్టర్ పిఎం ధాకరే తన ట్వట్టర్ ఎకౌంట్లో పోస్టు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://t.co/jxGT8A3kvE @PiyushGoyal
— Dr. PM Dhakate (@paragenetics) November 23, 2019