(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
వాటర్ పార్క్లో సునామీ ఎప్పుడైనా చూశారా. ఇటీవల చైనాలో ఒక చోట జనానికి ఇది అనుభవంలోకి వచ్చింది. ఉత్తర చైనాలో ఒక ఊరిలోని వాటర్ పార్క్లో కెరటాలు సృష్టించే మిషన్ అదుపు తప్పడంతో ఒక్కసారిగా సునామీ మాదిరిగా ఓ పెను కెరటం పుట్టింది. పూల్లో సరదాగా జలకాలాట ఆడుతున్న చిన్నా పెద్దా అందరూ దాని ధాటికి కొట్టుకుపోయారు. భయంతో స్విమ్మింగ్ పూల్ నుండి బయటపడేందుకు ప్రయత్నించారు. నీటిలోనే తొక్కిసలాట జరగడంతో 44మంది గాయపడ్డారు. వేవ్ మిషన్ నిర్వహిస్తున్న వ్యక్తి మద్యం తాగి ఉండటం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదని తరువాత తెలిసింది. పూల్లోని వేవ్ మిషన్లో సాంకేతికలోపం ఏర్పడటం వల్ల ఈ కృత్రిమ సునామీ ముంచెత్తింది. ఈ ఘటనలో ఒక మహిళ మోకాళ్లకు రక్తపు గాయాలు అయాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వాటర్ పార్క్ను మూసివేయించడంతో పాటు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.