(న్యూస్ ఆర్టిట్ డెస్క్)
నడుస్తున్న రైలులో ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరం అని ఎంత చెప్పినా.. నేటి యువత మాత్రం చెవికెక్కించుకోవడం లేదు. సర్కస్ ఫీట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ముంబైలో రైలు డోర్ ను పట్టుకుని ఫీట్స్ చేస్తున్న యువకుడు పట్టుతప్పి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన డిసెంబర్ 26న జరిగింది. ముంబై లోకల్ ట్రైన్ లో రైలు డోర్ ను పట్టుకుని ఫీట్స్ చేస్తున్న సదరు యువకుడు పట్టుతప్పి కిందపడిపోయాడు. అతని ఫీట్స్ ను మరో యువకుడు వీడియో తీశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ చేసిన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రైళ్లలో ప్రయాణిస్తున్న వేళ, యువత అనాలోచితంగా ఫీట్స్ కు పాల్పడవద్దని ట్వీట్ లో పేర్కొంది. ఫీట్స్ చేస్తున్న యువకుడు మరణించాడని, అతని పేరు దిల్షాన్ అని రైల్వే శాఖ తెలిపింది. రైళ్లలో ఈ తరహా చర్యలతో ప్రాణాలు కూడా కోల్పోవచ్చని హెచ్చరించింది. యువత ఇటువంటి ఫీట్స్ కు దూరంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ट्रेन में स्टंट ना करें ये गैरकानूनी है एवं जानलेवा भी सिद्ध हो सकता है।
मुंबई में 26 दिसंबर को दिलशान नाम का युवक ट्रेन के बाहर लटक कर स्टंट करते हुए अपनी जान गंवा चुका है।
अपनी सुरक्षा की अवहेलना करके ट्रेन के बाहर लटकना,चलती ट्रेन में चढ़ना, हादसे का बुलावा हो सकता है। pic.twitter.com/oGEsqjoka6
— Ministry of Railways (@RailMinIndia) December 30, 2019
కాగా, ప్రభుత్వాలు ఎన్నిసార్లు చెప్పినా యువత మాత్రం మారనంటోంది. ఫుట్ బోర్డుపై ప్రయాణం ప్రమాదకరం అని హెచ్చరికలు పెట్టిన వాటిని మాత్రం యువత పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయి కన్నవారికి శోకం మిగులుస్తోంది. ఇప్పటికే రైళ్లలో ఫుట్ బోర్డింగ్ పై ప్రయాణిస్తూ చాలామంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ కళ్లారా చూసి కూడా మాకేం కాదులే అన్న ధీమాతో యువత ఇంకా సర్కస్ ఫీట్లు చేస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటోంది.