Diwali 2022: దీపావళికి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇవి ట్రై చేయండి.

Visual Story Written by K Suma and Created by Deepak Rajula for NewsOrbit

ప్రపంచమే స్మార్ట్ ఫోన్స్ యుగం అయిపోయింది. ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం మంది స్మార్ట్ ఫోన్స్ కలిగి వున్నారని ఓ సర్వే తెలిపింది. దాంతోనే అర్ధం అయిపోతోంది, వీటి ప్రాముఖ్యత ఏమిటనేది.

ఈ క్రమంలో ముఖ్యంగా యువత యెంత ధర వెచ్చించైనా తమ కలల స్మార్ట్ ఫోన్స్ ని సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు చాలా మొబైల్స్ అందుబాటులో వున్నాయి. మీ బడ్జెట్ రూ.35 వేల వరకు ఉంటే.. మీరు అద్భుతమైన స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేయవచ్చు.

ఈ ప్రైస్ రేంజ్‌లో బెస్ట్ ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడుకొని వున్న అత్యాధునిక స్మార్ట్‌ఫోన్లను కొనవచ్చు. 

అందులో మొదటిది పోకో F4 5G స్మార్ట్‌ఫోన్. ఇది 12GB RAM+256GB స్టోరేజ్‌తో మార్కెట్లోకి లాంచ్‌ అయింది. దీని ధర రూ.33,999. అయితే దీపావళికి ప్రత్యేకంగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, డాల్బీ విజన్-సపోర్ట్‌తో 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్, విత్ ఛార్జర్‌తో లభిస్తుంది.

దీని తరువాత చెప్పుకోదగ్గది iQoo Neo 6 5G. ఇది 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా కలిగి వుంది.

ఆ తరువాత ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ A53 5G ఫోన్ అద్భుతమని చెప్పుకోవాలి. ఇది 8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ కలిగి వుంది.

ధర విషయానికొస్తే రూ.33,999కి మాటికెట్లో దొరుకుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ విశేషత ఏమంటే... దీనిని ట్యాబ్, బడ్స్, ల్యాప్‌టాప్, వాచ్‌లతో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.5 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది.

తరువాత ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ 2T ఫోన్ చెప్పుకోదగ్గది. ఇది 12GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ కలిగి రూ.33,999 ధర కలిగి వుంది. కాబట్టి స్నేహితులారా మీ బడ్జెట్ 35k లోపు అయినపుడు ఇవి ట్రై చేయొచ్చు.