దేశంలో విజ్ఞాన రంగం ఇంకా ప్రారంభ దశలో ఉండగానే భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 వాతావరణ పరికరాలను ప్రామాణికం చేసింది. పలు ప్రాంతాలలో సోలార్ రేడియేషన్ స్థాయిని కొలిచే పరికరాల వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓజోన్ పొర తీరు గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, పవన విద్యుత్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి వాతావరణ శాఖలో అనేక అద్భుతాలు సృష్టించారు.
1987లో ఐఎన్ఎస్ఏ కేఆర్ రామనాథన్ మెడల్తో ఆమెను సత్కరించింది ప్రభుత్వం. ఇన్ని అద్భుతాలు వాతావరణ శాఖలో సృష్టించటంతో అన్నా మణి భారత వాతావరణ శాఖకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్థాయికి చేరుకోవడం జరిగింది. మహాత్మా గాంధీని పూర్తిగా తీసుకున్న ఆమె తన జీవితకాలం పాటు ఖాది వస్త్రాలను ధరించడం జరిగింది. ఎంతసేపు విజ్ఞాన రంగానికి ఏదైనా అందించాలన్న దిశగా అన్నా మణి ఆలోచనలు చేసేవారు. దీంతో జీవితకాలం చివరివరకు ఆమె వివాహం చేసుకోలేదు. 2001వ సంవత్సరం ఆగస్టు 16వ తారీకు గుండె సంబంధిత వ్యాధితో ఆమె మరణించడం జరిగింది.