Pondicherry : దక్షిణాదిన శాసనసభ ఉన్న ఏకైక కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అనుకున్నదాని కంటే ముందుగానే ఇక్కడ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది . సోమవారం పాండిచ్చేరి ముఖ్య మంత్రి నారాయణస్వామి తన పదవికి రాజీనామా చేశారు. పాండిచ్చేరిలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం దీంతో కుప్పకూలి నట్లయింది. ఇప్పటికే ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో మైనారిటీలో పడిన ప్రభుత్వం సోమవారం బలనిరూపణ ఓటింగ్ కు వెళ్లకుండానే సీఎం నారాయణస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ సై కు రాజ్ భవన్ వెళ్లి రాజీనామా అందించారు. ఆదివారం సాయంత్రమె మరో ఇద్దరు కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అందరూ అనుకున్నట్లుగానే సోమవారం పాండిచ్చేరి అసెంబ్లీలో నారాయణ స్వామి బలాన్ని నిరూపించుకునే ఓటింగ్లో పాల్గొనేందుకు కూడా ఇష్టపడలేదు. అసెంబ్లీలో ప్రసంగం అనంతరం శాసనసభ నుంచి బయటకు వెళ్లిపోయిన ఆయన నేరుగా రాజ్భవన్కు వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ కు తన రాజీనామా పత్రాన్ని అందించారు.
పాండిచ్చేరిలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం మైనారిటీలో పడడంతో విపక్షాలు ప్రభుత్వం మీద విశ్వాస పరీక్ష నూ ప్రతిపాదించాయి. దీంతో సోమవారం పుదుచ్చేరి శాసనసభ ప్రత్యేకంగా దీనికోసమే సమావేశం అయింది. సభ ప్రారంభమైన తర్వాత సీఎం నారాయణస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆ తీర్మానంపై సభ్యుల ఓటింగ్ జరగకముందే ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అకస్మాత్తుగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో విశ్వాస తీర్మానం వీగిపోయిన ట్లు స్పీకర్ వి.పి. శివ కొలం దు ప్రకటించారు. అక్కడినుంచి సిఎం తన పదవికి రాజీనామా చేసేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు. తమిళసై కు తన రాజీనామాను ముఖ్యమంత్రి అందజేశారు.
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో సీఎం నారాయణస్వామి శాసనసభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. తాము ప్రజల మద్దతుతో గెలిచి డీఎంకే మద్దతు తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ గెలిచామని తమకు ప్రజల మద్దతు ఉందని ఆయన చెప్పారు. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షం తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. అలాగే పాండిచ్చేరి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, ప్రభుత్వ కార్యకలాపాలను కిరణ్బేడీ అడ్డుకున్నారంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఇది కేవలం బిజెపి కుట్రగా ఆయన అభివర్ణించే ప్రయత్నం చేశారు.
అనూహ్యంగా పాండిచ్చేరి రాజకీయాలు మారిపోయాయి. అటు ఇటు ఇటు అటు సంఖ్య తారుమారు అయింది. నిన్న మొన్నటి వరకు 18 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం నడిపిన కాంగ్రెస్ కూటమి బలం సోమవారానికి కేవలం 12 మంది సభ్యులకు పడి పోయింది. ఇక ప్రతిపక్షం ఎన్ ఆర్ కాంగ్రెస్ కూటమి బలం14 గా ఉంది. ఏడు మంది ఎన్ ఆర్ కాంగ్రెస్ సభ్యులు, నలుగురు అన్నాడీఎంకే సభ్యులతోపాటు బిజెపి తరఫున నామినేటెడ్ భాజపా ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. ప్రస్తుతం పుదుచ్చేరి అసెంబ్లీ కు 26 మంది సభ్యులు ఉంటే, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 14 మంది సభ్యుల బలం అవసరం. మరిప్పుడు ఎన్ ఆర్ కాంగ్రెస్ కూటమి భాజపా నామినేటెడ్ సభ్యులతో కలిసి పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేక ఎన్నికలకు వెళ్తుందా అనేది కీలకంగా మారింది. ఈ సమయంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి శాసనసభ ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమ మార్గంగా ఎన్ ఆర్ కాంగ్రెస్ కూటమి కూడా ఆలోచిస్తూ ఉండటం తో పుదుచ్చేరి ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది.
This post was last modified on February 22, 2021 1:37 pm
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల పోరు.. ఇతర నియోజకవ ర్గాలతో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య పోరు జోరుగా సాగిన విషయం తెలిసిం దే. ఒకరిపై… Read More
Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More
Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More
May 19: Daily Horoscope in Telugu మే 19 – వైశాఖ మాసం – ఆదివారం- రోజు వారి… Read More
Chandu: త్రినయని సీరియల్ లో నటించిన చందు మన అందరికీ సుపరిచితమే. ప్రజెంట్ చందు రాధమ్మ పెళ్లి, కార్తీకదీపం బంటి… Read More
Big Boss: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా బిగ్ బాస్ అంటే… Read More
Trinayani: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు… Read More
Bigg Boss Ashwini: అనేకమంది నటీనటులు బిగ్బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందుతున్నారు. గతంలో వారు ఎవరో ప్రేక్షకులకు… Read More
Anchor Varshini: చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాకి దగ్గరగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఉంటారు. మొదట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ… Read More
Tollywood: ప్రస్తుతం ఉన్న సీరియల్ తారలు సినిమా తారలు కంటే ఎక్కువ హాట్ గా కనిపిస్తున్నారు. సినిమాలు ఏ రేంజ్… Read More
Manasu Mamatha: ప్రజెంట్ సినీ ఇండస్ట్రీ మొత్తం వేడాకుల వ్యవహారాలతో వైరల్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు విడాకులు తీసుకుంటూ… Read More
Arvind Kejrival: లోక్ సభ ఎన్నికల తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుస ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నేతల అరెస్టు… Read More
ఏపీ సీఎం జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ కుమార్… Read More