Categories: వ్యాఖ్య

అసీమానందం!

Published by
Siva Prasad

ఫలానా మతం వారే ఉగ్రవాదులు. ఫలానా మతం వారు సాధు జంతువులు. ఫలానా మతం వారు ఉగ్ర దాడుల ఆరోపణల మీద పట్టుబడినా వారి మీద దర్యాప్తు  జరిపిన ఫలానా సంస్థ ఫలానా  రుజువులు చూపించలేక విఫలమవుతుంది. ఆ కారణం పునాదిగా ఫలానా కోర్టు వారు ఫలానా రోజున ఫలానా నిందితుడు, నిందితుడు కాదని నొక్కి వక్కాణిస్తుంది. తత్ పశ్చాత్ ఫలానా ఆరోపణలతో బందీ కాబడిన ఫలానా వ్యక్తి అసీమానందంతో బయటకొస్తాడు. అన్నట్టు ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది అసీమానంద స్వామి వారి గురించే.

కొన్నిసార్లు సందేహాలు కూడా భయావహంగానే వుంటాయి. ఎందుకంటే సందేహించే స్వాతంత్ర్యానికి సంకెళ్ళు పడ్డ కాలం కాబట్టి. 2007నాటి సమ్‌ఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ళ కేసులో స్వామి వారు నిందితులు. 2010, 2011లో కోర్టు విచారణ సందర్భల్లో స్వామివారే నేరాన్ని అంగీకరించినట్టు వార్తలు చదువుకున్నాం.  మక్కామసీదు, అజ్మేర్ షరీఫ్ పేలుళ్ళ కేసుల్లో కూడా స్వామీజీ నిందితుడే. కానీ ఆ రెండు కేసుల్లోనూ నిర్దోషిగా ఇంతకు ముందే బయటపడ్డారు. ఇప్పుడు ఈ కేసులో కూడా కోర్టు వారు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ.) తగిన రుజువులు చూపించలేకపోయిందని చెప్తూ అసీమానందను నిర్దోషిగా ప్రకటించింది. స్వామివారు చిన్మయంగా చిద్విలాసంగా కేసు నుంచి తప్పించుకున్నారు.

కోర్టు తీర్పును సందేహించలేం. కానీ కోర్టు ముందున్న సాక్ష్యాధారాలే పలువురి  సందేహాలకు పునాదులయ్యాయి.  ఎన్.ఐ.ఏ. నిజాయితీ ఇప్పుడు బోనులో నిలబడినట్టు అనిపిస్తోంది. సమ్‌ఝౌతా కేసులో ఒక్కరూ నిందితులు కాదని కోర్టు తేల్చి చెప్పేసింది. ఈ కేసులో స్వామి అసీమానంద ప్రథమ ముద్దాయి. అదేమిటోగాని హిందుత్వ టెర్రర్ అని కొందరు పిలిచే కేసుల్లో మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ శిక్షలు పడలేదు. అదేమిటో అని సందేహించడానికి కూడా వెన్నులో వణుకు పుట్టేంత భయం కలుగుతుంది. ఎన్.ఐ.ఏ. దర్యాప్తు సంస్థ రుజువులు చూపించడంలో ఘోరంగా విఫలమవుతోంది. ఫలానా కేసుల్లోనే ఇలా ఎందుకు జరుగుతుంది? ఫలానా కేసుల్లో ఎందుకు జరగదు? అని అనుమానాలు వ్యక్తం చేయడానిక్కూడా ఇప్పుడు పెద్ద సాహసమే చేయాలి. 2006, 2008లో మాలేగావ్ పేలుళ్ళు జరిగాయి. 2007లో సమ్‌ఝౌతా ఎక్స్ ప్రెస్, మక్కామసీదు,అజ్మేర్ షరీఫ్ పేలుళ్ళు జరిగాయి. ఏ కేసులోనూ ఒక్కరూ నిందితులుగా ఏ ఒక్క దర్యాప్తులోనూ తేలలేదంటే కొంచెం ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనుమానం కలగక మానదు కదా! అదిగో అలా అనుమాన పడితే సాక్షాత్తూ కోర్టులను, దర్యాప్తుసంఘాలనూ వాటి నిజాయితీలనూ శంకిస్తున్నట్టు కొరడా పట్టుకుని కొందరు విరుచుకుపడతారు.

బహుశా ఫలానా మతం ఏలుబడిలో ఉన్న దేశంలో ఫలానా ఫలానా కేసులన్నీ ఇలానే ఇలానే ముగుస్తాయేమో! సమ్ ఝౌతా పేలుళ్ళ కేసును మొదటి మూడేళ్ళపాటు దర్యాప్తు చేసిన ఒక హర్యానా పోలీసు అధికారి ఇప్పటికీ సాక్ష్యాలు బలంగా వున్నాయని వాదిస్తున్నారట. మరి ఆయన మాటలు వినేవాళ్ళెవరు? 2011లో ఈ పేలుళ్ళ కేసుల్ని ఎన్.ఐ.ఏ. చేతుల్లో పెట్టాక వరసగా దోషులు నిర్దోషులయ్యారు. చాలా మందికి బెయిలొచ్చింది. కేసులన్నీ నీరుగారడం ఎలాగో దేశానికి తెలిసొచ్చింది.

ఇంత దేనికి, ఒక్క అసీమానంద వ్యవహారమే చూద్దాం. ఆయనే స్వయంగా కోర్టులో నేరాన్ని అంగీకరించినట్టు వార్తలున్నాయి. అవన్నీ తనను హింసపెట్టడం వల్ల చెప్పానని తర్వాత చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన కారవాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు చూస్తే చాలా భయానకంగా వున్నాయి. కోర్టులో చెప్పింది అంతా అబద్ధమని..తాను ఈ హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడడం చాలా గర్వంగా వుందని చెప్పుకున్నారు. అదే పత్రిక కథనంలో తాము ముస్లింలే లక్ష్యంగా సాగించిన  దాడులకు  ఆరెస్సెస్ నాయకులు మోహన్ భగత్, ఇంద్రేష్  కుమార్ల ఆశీస్సులు పుష్కలంగా వున్నట్టు స్వామీజీ తెలిపారు.  ఇవన్నీ చూశాక కూడా సందేహాలకు తావివ్వరాదని ఎవరైనా అంటే అసలు సత్యం అనేది ఒకటి వుందా అన్న పెను సందేహం కలగక మానదు.

మరో విచిత్రమైన వార్త ఏమంటే ఈ కేసుల్లో వాదించిన ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నేరుగా దర్యాప్తు సంఘం నిజాయితీనే ప్రశ్నించారు. 2008 మాలేగావ్ పేలుళ్ల కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి బహిరంగంగా చెప్పిన మాట వింటే ప్రజాస్వామ్యం బతికే వుంటే దాని తల వెయ్యి ముక్కలవుతుంది. 2014 లో ఎన్.డి.ఏ. అధికారంలోకి వచ్చాక శాఫ్రాన్ టెర్రర్ కేసుల పట్ల కాస్త మెతక వైఖరితో పొమ్మని నేరుగా తనకు సలహాలు అందాయని ఆమె చెప్పారు. ప్రఖ్యాత సాధ్వి ప్రజ్ఞ ఎలా ఈ కేసుల నుంచి బయటపడ్డారు? పురోహిత్ ఎలా తప్పించుకున్నారు? ఇలాంటి అనుమానాలు ఎవరికైనా వస్తే వాటికి జవాబులు దొరకవు.

ఇదంతా చూశాక ఫలానా దేశంలో ఫలానా మతం వారికే శిక్షలు పడతాయని ఫలానా మతం వారు వీరులుగా కీర్తించబడతారని మనం అర్థం చేసుకోవాలి కాబోలు! ఇట సందేహంబులు సంచరించుటకు తావే లేదు అని పద్యాలు పాడుకోవాలేమో. ఫలానే వారు నిందితులుగా ఉన్న కేసుల్లో శిక్షలు ఎంత వేగవంతంగా అమలవుతాయో, ఫలానా వారి కేసులు అంతే వేగంగా నీరుగారిపోవడం షరా మామూలే అని సరిపెట్టుకోవాలేమో! ఏది ఏమైనా సందేహం సందేహమే. అది సత్యాన్వేషకుల దేహంలో ఒక భాగమై సలపరం పెడుతూనే వుంటుంది. కానీ ఫలానా ఫలానా వాదులకు ఈ పరిణామాలు అసీమానందాన్నిస్తాయి.

-ప్రసాదమూర్తి

Siva Prasad

Share
Published by
Siva Prasad

Recent Posts

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More

May 19, 2024

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More

May 19, 2024

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More

May 19, 2024

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More

May 19, 2024

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన దెబ్బకు మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పిఠాపురం… Read More

May 19, 2024

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

Anasuya Bharadwaj: స్టార్ యాంక‌ర్‌, న‌టి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెల‌బ్రేట్… Read More

May 19, 2024

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More

May 19, 2024

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జ‌రిగింది.… Read More

May 19, 2024

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఇక‌, ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా నాయ‌కులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వ‌ర‌కు మార్మోగిన… Read More

May 19, 2024

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఏరేంజ్‌లో జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే. పెను తుఫాను వ‌చ్చిందా? సునామీ క‌ది లి వ‌చ్చిందా? అన్న‌ట్టుగా ఈ… Read More

May 19, 2024

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల పోరు.. ఇత‌ర నియోజ‌కవ ర్గాల‌తో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More

May 19, 2024

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More

May 19, 2024

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు జోరుగా సాగిన విష‌యం తెలిసిం దే. ఒక‌రిపై… Read More

May 19, 2024

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More

May 19, 2024

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More

May 19, 2024