PM Modi: తెలంగాణ బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీ బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని మోడీ పాల్గొని.. సమ్మక్క – సారలక్కకు జై అంటూ ప్రసంగాన్ని మొదలు పెట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. మీ ఆశీర్వాదంతోనవే తాను ప్రధానిని అయ్యానన్నారు. మీ ఆశీర్వాదంతోనే బీజేపీ బీసీ వ్యక్తి తెలంగాణ సీఎం అవుతారని అన్నారు. అన్నివర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. కేసిఆర్ కు రాష్ట్ర ప్రజల కంటే తన కుటుంబ ప్రయోజనమే ముఖ్యమని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీకి సీ టీమ్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చిందనీ, నీళ్లు, నిధులు, నియామకాలపై బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందన్నారు . బీసీల ఆకాంక్షలను ఎప్పుడూ బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలను మోసం చేశారని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీపైనే విశ్వాసంతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో మార్పు మొదలైందని, ఆ మార్పు తుఫాను ఈ మైదానంలోనే కనిపిస్తుందన్నారు. ఈ సభకు వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలను చూస్తుంటే కుటుంబ సభ్యుల మధయ్ ఉన్నట్లు అనిపిస్తొందన్నారు. బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం భారతదేశ చరిత్రలో కొత్త ప్రయోగమని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఓటమి ఖాయమని డంకా భజాయించి చెబుతున్నానన్నారు.
తొమ్మిది సంవత్సరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారన్నారు. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది బీజేపీయేనన్నారు. అబ్దుల్ కలామ్ ను వాజ్ పేయి రాష్ట్రపతిని చేశారనీ, పీఎ సంగ్మా, బాలయోగిని స్వీకర్ చేసింది. రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేసింది. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసింది బీజేపీయేనని గుర్తు చేశారు. ఓబీసీ అయిన తనను ప్రధాని చేసింది బీజేపీయేనన్నారు. ఓబీసీ కేంద్ర మంత్రులు ఎక్కువగా ఉన్నది ఎన్డీఏ సర్కార్ లోనేనని చెప్పారు. ఓబీసీలకు ఎంపిలుగా ఎక్కువ అవకాశమిచ్చింది కూడా బీజేపీయేనన్నారు. కేసిఆర్ నేరవేర్చని హామీలను గుర్తు చేస్తూ తమ ప్రభుత్వం వివిధ వర్గాల అభ్యున్నతికి చేస్తున్న కృషి వివరించారు. అవినీతి సర్కార్ ను ఇంటికి పంపడం ఖాయమన్నారు.
ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని, అందరూ శిక్షార్హులే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారిని కఛ్చితంగా జైలులో వేస్తామని అన్నారు. అయిదు తరాల భవిష్యత్తును కాంగ్రెస్ నాశనం చేస్తే .. రెండు తరాల భవిష్యత్తును బీఆర్ఎస్ నాశనం చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పేదలకు అయిదేళ్లు ఉచితంగా బియ్యం అందిస్తామని చెప్పారు. పేదలకు ఉచిత రేషన్ .. ఇది మోడీ ఇస్తున్న గ్యారెంటీ అని ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దోషులను వదిలిపెట్టామని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మోడీ స్పందిస్తూ.. అవినీతికి పాల్పడ్డ ఎవరినీ వదిలిపెట్టమని అన్నారు.
CM YS Jagan: చంద్రబాబు హయాంలో అన్నీ స్కామ్లేనని మరో సారి దయ్యబట్టిన సీఎం జగన్
May 20: Daily Horoscope in Telugu మే 20 – వైశాఖ మాసం – సోమవారం- రోజు వారి… Read More
Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇబ్రహీం రైసీ… Read More
YSRCP: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాటు ఆయన… Read More
Human Trafficking Rocket: ఉద్యోగాల పేరిట ఏపీ, తెలంగాణ నిరుద్యోగ యువకులను మోసం చేసి కంబోడియా కు తీసుకువెళ్లి, చీకటి… Read More
Pavitra Jayaram: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడు చందు నటి… Read More
OTT: ఓటిటిలో కామెడీ డ్రామా సినిమాకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మరి ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే… Read More
Padamati Sandhya Ragam: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీ వారు కంటే సీరియల్ ఇండస్ట్రీకి చెందిన వారే ఎక్కువగా పాపులారిటీని… Read More
Small Screen: ప్రజెంట్ జనరేషన్ లో చాలామంది సెలబ్రిటీస్ గృహప్రవేశాలు మరియు కారులో కొనుగోలు చేయడం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.… Read More
Chandu: వాళ్ళిద్దరి బంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో తమ మరణాలతో చాటి చెప్పిన నటీనటులు పవిత్ర జయరాం, చందు.… Read More
Shobha Shetty: బిగ్బాస్ సీజన్ 7 షోలో పాల్గొన్న శోభా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ… Read More
JD Lakshminarayana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ… Read More
TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే కేబినెట్ భేటీపై కొన్ని షరతులను విధించింది ఈసీ.… Read More
ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.… Read More
Arvind Kejrival: ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు… Read More
NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మరియు వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.… Read More