‘కలిసికట్టుగా నడవాలి’

Published by
sharma somaraju

 

అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పార్టీలోని నేతలు అందరూ భిన్నాబిప్రాయాలు లేకుండా ఒకే మాటగా ముందుకు సాగాలని ఏపి బిజెపి నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. హైదరాబాదు గచ్చిబౌలిలోని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో శనివారం ఏపి బిజెపి నేతలు  సమావేశం అయ్యారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషణ్ రెడ్డి, సునీల్ దియోధర్ తో పాటు ఏపికి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేష్, ఆ పార్టీ ముఖ్య నేతలు దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, మాణిక్యాలరావు, సత్యమూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, ప్రజా సమస్యలపై ఏరకంగా ముందుకు సాగాలి, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. వివిధ అంశాలపై పార్టీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే అందరు నాయకులు వ్యవహరించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం నుండి హజరైన పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. విజయవాడలో రాష్ట్ర పార్టీ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యల అనంతరం రాజధాని అమరావతి అంశంపై ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒక రకంగా, ఆ పార్టీకి నాయకులు కొందరు మరో రకంగా వ్యాఖ్యానాలు చేసిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గట్టిగా చెబుతూ అమరావతి ప్రాంత రైతాంగానికి కూడా బిజెపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ నాలుగు ప్రాంతాల్లో రాజధాని అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానాలు చేశారు. అదే మారిదిగా మరో రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు కూడా రాజధాని ఏర్పాటు అనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని, కేంద్రానికి సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ మహిళా నేత దగ్గుబాటి పురందేశ్వరి కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని వ్యాఖ్యానించారు. రాజధాని మార్చడం అంటే సులువు కాదని మరో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పేర్కొన్నారు.

రాజధాని అంశంలో ఒకే పార్టీకి చెందిన నేతలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత కారణంగా వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే టిడిపి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది.  రాష్ట్రంలోని పలు ప్రధాన సమస్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి పలు లేఖలను రాశారు. అయితే లేఖలకు సమాధానాలే ఇవ్వడం లేదని ఇటీవల కన్నా పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో బిజెపి నేతలు ఈ  సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకోంది.

This post was last modified on August 31, 2019 9:35 pm

sharma somaraju

Recent Posts

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

Anasuya Bharadwaj: స్టార్ యాంక‌ర్‌, న‌టి అనసూయ భరధ్వాజ్ రీసెంట్ గా తన 39వ బర్త్ డే ని సెల‌బ్రేట్… Read More

May 19, 2024

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

Fire In Flight: రెండు రోజుల క్రితం ఢిల్లీ – బెంగళూరు ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో ఢిల్లీ విమానాశ్రయంలో… Read More

May 19, 2024

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు. ఇక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏకంగా 86.11 శాతం పోలింగ్ జ‌రిగింది.… Read More

May 19, 2024

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. ఇక‌, ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా నాయ‌కులు, పార్టీలు ఉన్నాయి. నిన్న మొ న్నటి వ‌ర‌కు మార్మోగిన… Read More

May 19, 2024

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఏరేంజ్‌లో జ‌రిగాయో అంద‌రికీ తెలిసిందే. పెను తుఫాను వ‌చ్చిందా? సునామీ క‌ది లి వ‌చ్చిందా? అన్న‌ట్టుగా ఈ… Read More

May 19, 2024

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల పోరు.. ఇత‌ర నియోజ‌కవ ర్గాల‌తో పోల్చుకుంటే భిన్నంగా సాగింది.… Read More

May 19, 2024

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడతలో భాగంగా ఈ నెల 13న 25 లోక్ సభ స్థనాలతో… Read More

May 19, 2024

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య పోరు జోరుగా సాగిన విష‌యం తెలిసిం దే. ఒక‌రిపై… Read More

May 19, 2024

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

Santhosham Movie: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ ప్రయాణంలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సంతోషం ఒకటి.… Read More

May 19, 2024

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More

May 19, 2024

May 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 19: వైశాఖ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

May 19: Daily Horoscope in Telugu మే 19 – వైశాఖ మాసం – ఆదివారం- రోజు వారి… Read More

May 19, 2024

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Chandu: త్రినయని సీరియల్ లో నటించిన చందు మన అందరికీ సుపరిచితమే. ప్రజెంట్ చందు రాధమ్మ పెళ్లి, కార్తీకదీపం బంటి… Read More

May 18, 2024

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Big Boss: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా బిగ్ బాస్ అంటే… Read More

May 18, 2024

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Trinayani: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు… Read More

May 18, 2024

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Bigg Boss Ashwini: అనేకమంది నటీనటులు బిగ్బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందుతున్నారు. గతంలో వారు ఎవరో ప్రేక్షకులకు… Read More

May 18, 2024