YS Jagan : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ BJP నేతలు పదేపదే స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి CM వైఎస్ జగన్మోహనరెడ్డి ys jagan mohan reddy, వైసీపీ ycp ఎంపీ MP లు తరచు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ మాట్లాడుతున్నారు. నిన్న పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala sitaraman 2021- 22 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు లేకపోవడం పట్ల అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు..కేంద్ర బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు భారీగా నిధుల కేటాయింపులు చేసిన ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసిందని విమర్శిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా తదితర విషయాల గురించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని అంటున్నారు. బడ్జెట్ కేటాయింపులలో ఆంధ్రకు అన్యాయం జరిగిందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి vijaya sai reddy అన్నారు. ఏపికి కేంద్రం మొండిచేయి చూపించిందని విమర్శించారు. పోలవరం Polavaram ప్రాజెక్టు గానీ, మరే ఇతర పథకాలకు గానీ నిధులు కేటాయించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కశ్చితంగా ప్రకటించాల్సిందేనని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ నేతల విమర్శలపై బీజెపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి sujana chowdary స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఒక వేళ ప్రధాన మంత్రి అయినా ఏపికి ప్రత్యేక హోదా సాధించలేరని అన్నారు సుజనా చౌదరి. జగన్ ఢిల్లీ వచ్చి ఏమి చేస్తున్నారో ఏమీ తెలియడం లేదని అన్నారు. జగన్ ఢిల్లీకి వచ్చి కేంద్ర పెద్దలను కలుస్తున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనీ, సొంత కేసులు, సొంత వ్యవహారాల కోసమని విమర్శించారు సుజనా చౌదరి. ఎన్నికల బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ లో నిధుల కేటాయింపు అవసరం లేదని, దానికి కేంద్రం నిధులు వేరుగా ఇస్తుందని సుజనా చౌదరి అన్నారు.
This post was last modified on February 2, 2021 2:59 pm
Supreme Court: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సుప్రీం కోర్టులో… Read More
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More
Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More
Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More