సీఎం జగన్ చెబుతున్నదేమిటి…? అవినీతి రహిత పరిపాలన…!
కొందరు నాయకులూ… అధికారులూ చేస్తున్నదేమిటి…?? అవినీతి సహిత పాలన…!
సీఎం ఆశయానికి చేదోడుగా నిలవాల్సిన ఐఏఎస్ లు కూడా అవినీతికి తెర తీస్తుండడం… ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని మరణించడం … ప్రభుత్వానికి మచ్చగా మారి… కేంద్రం నుండి కూడా నిఘా పెరిగేలా చేసింది… ఈ అవినీతి వ్యవహారంపై “న్యూస్ ఆర్బిట్” అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.
పది రోజుల కిందట ఓ ఐఏఎస్ అధికారిని చనిపోయారు. పోస్టింగు లేక, ఇద్దరు సీనియర్ అధికారుల తీవ్ర వేధింపులు, ఒత్తిళ్లు తట్టుకోలేక ఒత్తిడితో అనారోగ్యానికి గురై మరణించారు. ఆమె మరణం తర్వాత కొన్ని కీలక అంశాల బయటకు వస్తున్నాయి. ఆమె ఓ బ్రాహ్మిణ్… ఆమె మరణానికి కారణాలు వివరిస్తూ ఆమె సోదరుడు తెలంగాణాలో ఉండే ఓ బిజెపి పెద్దకి చెప్పారు. ఆయన కేంద్రంలో ఐఏఎస్ ల వ్యవహారాలూ చూసే డీవోపీటీ (డిపార్ట్మెంట్ అఫ్ పర్సనల్ ట్రైనింగ్) కి పిర్యాదు చేసారు. అందులో కొన్ని కారణాలు స్పష్టంగా పేర్కొన్నారు. ఆమె మరణానికి దారి తీసిన పరిస్థితులు, జగన్ ప్రభుత్వంలో కొందరు ఐఏఎస్ లు వ్యవహరిస్తున్న తీరుని వివరించారు. దీనిపై కేంద్రం సీరియస్ గా రియాక్ట్ అయింది.
డీవోపీటీ కి చేరిన ఫిర్యాదులో సారాంశం ఏమిటంటే…! “ఆమెకి ఆరు నెలల నుండి పోస్టింగు లేదు. వాణిజ్య పన్నుల శాఖలో పని చేసే ఆమెను బదిలీల సమయంలో పక్కన పెట్టారు. పోస్టింగు కోసం ఆమె జగన్ పేషీలోని ఓ కీలక అధికారి వద్దకు వెళ్లారు. అందుకు ఆయన “ఆఫీస్ నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ. లక్ష ఇవ్వాలి అని కండిషన్ పెట్టారట. ఆమె అంగీకరించలేదు. అంతకు ముందు మరో అధికారి (ఆమె పని చేసే శాఖ ఉన్నతాధికారి) “మా భార్య ఢిల్లీ వెళ్లారు. కారు బిల్లులు, రూమ్ బిల్లులు చెల్లించాలి.” అంటూ అడిగారట. ఆమె అంగీకరించలేదు. అసలే బ్రాహ్మిణ్ సామాజికవర్గం, మంచి అధికారిణిగా పేరుంది. అందుకే అవినీతికి అంగీకరించకుండా లోలోపల కుంగిపోయింది. చివరికి ఒత్తిళ్లకు తట్టుకోలేక మరణించారు. ఇక్కడ మనం చెప్పుకున్న సీఎం పేషీలో కీలక అధికారి గుర్తు పెట్టుకోండి. ఆయన మరిన్ని లోలోపలి వ్యవహారాలు మరో సందర్భం చూసుకుని పూర్తిగా చెప్పుకుందాం.
ఈ విషయం బిజెపి పెద్దలకు చేరడంతో సీరియస్ గా స్పందించారు. ఉన్నట్టుండి 30 మంది ఐ ఎఫ్ ఎస్ అధికారులకు ఏపీలో పోస్టింగు ఇచ్చేసారు. వీరిలో కొందరు నిఘా అధికారులు గానూ, కేంద్ర పెద్దలకు సమాచారం ఇచ్చేలా ఉన్నారని తెలుస్తుంది. కేంద్ర నిఘా సంస్థల ద్వారా కూడా రాష్ట్రంలోని కొందరు అధికారుల పని తీరుపై నివేదికలు తెప్పించుకున్నారట. ఇదే తీరు కొనసాగితే సీఎం జగన్ ప్రమేయం లేకుండానే కొందరి మార్పులు జరిగినా ఆశ్చర్యం అవసరం లేదు.
సీఎం జగన్ పదే పదే అవినీతి రహిత పాలన అంటున్నారు. ఆయన ఆశయంతో వెంట నడవాల్సింది ఐఏఎస్ లే. ఏ ముఖ్యమంత్రికి అయినా తన లక్ష్యాలకు అనుగుణంగా పని చేసే అధికారులు (ఐఏఎస్ ఐపీస్) లు ఉంటేనే అనుకున్నది జరుగుతుంది. కానీ ఇటువంటి అవినీతి మరకలు ఉన్న అధికారులను పక్కన పెట్టుకుని సీఎం మంత్రం ఏం చేయగలరు…? కోర్టులు, విపక్షాలు, కొందరు సీనియర్ నాయకులు అందరూ ఏకమై ముప్పేట దాడులు చేస్తున్న సమయంలో జగన్ కి తోడు, నీడగా ఉండాల్సింది బ్యూరోక్రసీ అధికారులే. జగన్ ఆశయం నిజమైనది అయితే.., ఆయన అవినీతి రహితం అంటున్న మాట అంతఃకరణ శుద్ధితో వస్తే… వెంటనే తన పేషీలోని అవినీతిపై ద్రుస్తి పెట్టాల్సిందే… లేకుంటే మరి కొంత మంది మంచి అధికారులు అసువులు బాసక తప్పదేమో.
This post was last modified on June 7, 2020 8:49 pm
YSRCP: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల… Read More
Manam Movie: తన తండ్రి, కొడుకుతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించాలనేది అక్కినేని నాగార్జున కల. ఆయన కల… Read More
SS Rajamouli: RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే… Read More
Tollywood Actress: సూపర్ స్టార్ రజనీ కాంత్, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి… Read More
Eesha Rebba: అందం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రాక సతమతం అవుతున్న హీరోయిన్ల జాబితాలో ఈషా రెబ్బ… Read More
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కొందరు మహిళలు ఏడ్చేశారు.. మరికొందరు కొంగు చాపారు. ఇంకొందరు అనేక దణ్ణాలు కూడా పెట్టారు. ఇక,… Read More
ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ అనూహ్యంగా పెరిగింది? ఇది గత ఎన్నికలకంటే కూడా ఎక్కువగా ఉంది. దీనికి రీజన్ ఎవరు? అంటే..… Read More
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసి.. నాలుగు రోజులు అయింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కొన్ని… Read More
ఏపీలో ఎన్నికల వ్యూహాలు మారాయి. పోలింగ్ నమోదు ప్రక్రియ అనూహ్యంగా పెరిగిన తర్వాత.. రెండు వైపులా ఒక విధమైన స్తబ్దత… Read More
NTR - Prashanth Neel: ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న యంగ్ టైగర్… Read More
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More
Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More
Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More
Krishna Mukunda Murari May 17 2024 Episode 472: భవానీ దేవి పంతులు గారిని పిలిచి ముకుందా ఆదర్శ… Read More