ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నది రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నప్పటికీ గడిచిన మూడు, నాలుగు నెలల్లో జరిగిన వ్యవహారాలన్నీ ఆయన చుట్టూ రాజకీయం, ఓ సామాజిక వర్గం వ్యవహారాలే ఎక్కువగా నడిచాయి. ఆయనను తిరిగి అదే కుర్చీలో కూర్చోబెట్టడంలో రాజకీయం, సామాజిక వర్గం గట్టిగానే పనిచేసిందని అనడంలో సందేహం లేదు. అందుకే ఇప్పుడు నిమ్మగడ్డ కు, నిమ్మగడ్డ తో సహా ఆయనకు అనుకూలంగా పని చేసిన పార్టీ లకు, నాయకులకు జగన్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. నిమ్మగడ్డ కు కుర్చీ వేసినట్లే వేసి కోరలు పీకేసింది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్. అంటే ఎన్నికలు జరిగితేనే ఆయనకు హోదా, అయన మాటకు బలం, అయన కుర్చీకి గళం. అయన చుట్టూ బలగం. ఎన్నో భజనలు అన్నీ చేరుతాయి. కానీ ఎన్నికలే లేకపోతే ఆయనకు ఇంక పనేముంది. అయన పని ఆయనదే. రాష్ట్ర ప్రభుత్వం పని రాష్ట్ర ప్రభుత్వం దే. ఏ పార్టీ పని ఆ పార్టీదే. ఇక మీదట అదే జరగనున్నది. ఎన్నో తిప్పలు పడి ఎన్నో పాయింట్ లు లాగి చివరకు ఓడిపోయి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అదే స్థానం లో నియమించిన ప్రభుత్వం మరో దెబ్బ కొట్టింది. ఆయనకు పని లేకుండా చేసింది. స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై పరోక్షంగా పై చేయి సాధించింది.
ఇక స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ రోజే ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకారం చూసుకుంటే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేనట్లే. దానికి అనేక కారణాలు ఉండవచ్చు. కరోనా కూడా కారణం కావచ్చు. కానీ ప్రధాన కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ కుర్చీలో ఉండటమే. అందుకే ప్రస్తుతానికి స్థానిక సంస్థ ల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగించిన ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ దిగిన తరువాత స్థానిక ఎన్నికలు నిర్వహిస్తుందా? అప్పటి వరకు వాయిదా వేస్తూ వస్తుందా? లేదా నిమ్మగడ్డ తో రాజీ ఫార్ములా కు వెళ్లి ఎన్నికలకు సై అంటుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సందేహమే. అయితే స్థానిక ఎన్నికలను ఎక్కువగా వాయిదా వేయడం కూడా ప్రభుత్వం చేతిలో పని కాదు. ఇప్పటికే రిజర్వేషన్ల అంశం,ఎన్నికలు ఆలస్యం అవడంపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసి మరి గడువు విధించి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కరోనా కాలమని ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఎన్నికలను పూర్తి స్థాయిలో వాయిదా వేయాలన్నా కోర్టు లకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిందే. అది ఎలా జరుగుతుంది, ఏం చేస్తుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి.
This post was last modified on August 7, 2020 9:10 am
Tragedy: అమెరికాలో విషాద ఘటన జరిగింది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఒక ప్రమాదం… Read More
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ… Read More
Chintamaneni: దెందులూరు టీడీపీ అభ్యర్ధి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. పెదవేగి… Read More
Krishnamma: థియేటర్స్ లో విడుదలైన సినిమాలను నెల లేదా రెండు నెలల తర్వాత ఓటీటీ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.… Read More
Krishna Mukunda Murari May 17 2024 Episode 472: భవానీ దేవి పంతులు గారిని పిలిచి ముకుందా ఆదర్శ… Read More
Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: విక్కీ ఉద్యోగ ప్రయత్నంలో చాలా ఆఫీసులకి తిరుగుతాడు. కానీ… Read More
Brahmamudi May 17 2024 Episode 412: దుగ్గిరాల ఇంట్లో పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మరోవైపు కావ్య ను రౌడీలు… Read More
May 17: Daily Horoscope in Telugu మే 17 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో పోలీసు… Read More
EC: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత చేలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్… Read More
AP Elections: కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హజరైయ్యారు.… Read More
CM YS Jagan: ఏపీలో ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విదంగా… Read More
Weekend OTT Movies: ప్రతి వీకెండ్ లాగానే ఈ వీకెండ్ కూడా అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ… Read More
పోలింగ్ అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు 144 సెక్షన్ విధించిన విషయం తెలిసిందే. ఈ… Read More
OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన అరాణ్మణై 4 తో పాటు విశాల్ రత్నం సినిమా లు ఒకేరోజు ఓటిటి… Read More