ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు సీఎం జగన్ ఫించన్ను ఏటా రూ.250 పెంచుకుంటూ అందజేస్తానని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన ఫించన్ను రూ.3వేలకు పెంచి ఇస్తానని చెప్పారు. తరువాత ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతానన్నారు. కానీ ఆయన ఇచ్చిన మాటను తప్పినట్లు స్పష్టమవుతుంది. మొదటి ఏడాది ఫించన్ను రూ.250 పెంచారు. దాన్నే ఇప్పటికీ అమలు చేస్తున్నారు. అయితే జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండో ఏడాది అవుతున్నా ఫించన్ పెంపుపై ఆయన ఇప్పటికీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో వైసీపీలోనే ఈ విషయంపై అందరూ తలో అభిప్రాయం చెబుతున్నారు.
ఇక సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఫించన్ను రూ.2500 వరకు పెంచాలని ఇప్పుడు ఏపీలో విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కానీ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అందుకు ఆర్థిక ఇబ్బందులో, లేదా మరేదైనా కారణం ఉంటుందో తెలియడం లేదు. ఇక ఈ పరిస్థితిలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్కు.. రూ.250 ఫించన్ను ఈ ఏడాది పెంచాలని లేఖ రాశారు. ఆ పెంపును మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలని రఘురామకృష్ణ లేఖ రాశారు. దీంతో ఈ లేఖ విషయం ఇప్పుడు ఏపీలో సంచలనం సృష్టిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వృద్ధాప్య పించన్ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ అవ్వాతాతల పథకానికి జీవో ఇచ్చారు. ఈ విషయాన్ని రఘురామకృష్ణం రాజు తన లేఖలో పేర్కొన్నారు. 2019 జూలై నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుందని చెప్పారు కానీ.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి దీన్ని అమలు చేస్తున్నారని రఘురామ తన లేఖలో తెలిపారు. దీంతో లబ్దిదారులు మొత్తం 7 నెలల కాలానికి రూ.15,750 వరకు నష్టపోయారన్నారు. ఈ క్రమంలో ఆ మొత్తం లబ్ధిదారులకు వెంటనే అందేలా చూడాలని రఘురామ.. జగన్ను లేఖలో కోరారు. అలాగే చెరువులు, పార్కులు, స్థలాల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి కాకుండా చూడాలని కూడా రఘురామ లేఖలో కోరారు. దీంతో ఇప్పుడీ విషయం సంచలనం రేపుతోంది.
This post was last modified on July 5, 2020 11:44 pm
May 21: Daily Horoscope in Telugu మే 21 – వైశాఖ మాసం – మంగళవారం- రోజు వారి… Read More
Trivikram Ram: తెలుగు చలనచిత్ర రంగంలో టాప్ మోస్ట్ దర్శకులలో త్రివిక్రమ్ పేరు ఒకప్పుడు వినబడేది. కానీ "గుంటూరు కారం"… Read More
Lok Sabha Elections: ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల ఐదో… Read More
అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంట్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి గా జయ… Read More
TS Cabinet Key Decisions: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకుపైగా కొనసాగిన… Read More
Junior NTR: నేడు అనగా మే 20వ తారీకున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మన సంగతి మన అందరికీ తెలిసిందే.… Read More
This Week OTT Movies: ఎప్పటిలాగానే ప్రతివారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. న్యూ వీక్ వచ్చిందంటే… Read More
Jabardasth Faima: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంది నటీనటులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా అడుగుపెట్టిన వారు… Read More
NTR: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో అల్లూరి సీతారామరాజు కూడా ఒకటి. బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఇది కూడా… Read More
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ తో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ శోభా శెట్టి. అద్భుతమైన… Read More
Poll Violence: ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ తన ప్రాధమిక నివేదికను… Read More
ISIS Terrorists Arrest: గుజరాత్ ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ సోమవారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు నిషేదిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్… Read More
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్ నియమితులైయ్యారు. సుప్రీం లీడర్ అయతొల్లా ఆలీ ఖమేనీ దీనికి ఆమోదముద్ర వేశారు. అధ్యక్షుడుగా… Read More
Road Accident: చత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్ వాహనం అదుపుతప్పడంతో 18… Read More
NTR: స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. తనదైన ప్రతిభతో… Read More