YS Sharmila: తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా రాజకీయ పార్టీ స్థాపించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు షర్మిల సిద్దమయ్యారు. ఎలాంటి షరతులు లేకుండానే విలీనానికి షర్మిల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వారంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో షర్మిల పార్టీలో చేరనున్నారుట. ఇప్పటికే ఈ అంశంపై పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను షర్మిల తీసుకున్నారు. అయితే విలీనం అయిన తర్వాత ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి షర్మిల బరిలో దిగనున్నారని సమాచారం.
అయితే సోనియా గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీలో ఏ రోజున చేరనున్నారు అనే దానిపై స్పష్టత రాలేదు. దీనిపై కాంగ్రెస్, వైఎస్ఆర్ టీపీ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. గతంలో వైఎస్ జయంతి సందర్భంగా షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమయ్యారంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఇడుపులపాయకు సోనియాతో పాటు రాహుల్ గాంధీ వస్తున్నారని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే అది ముందుకు సాగలేదు. ఎట్టకేలకు ఈ వారంలో షర్మిల పార్టీకి సంబంధించిన విషయంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక అంశంపై తొలుత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది స్వాగతిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి వర్గం మాత్రం షర్మిలను ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ చేయడానికైతే సుముఖత చూపారన్నట్లు ప్రచారం జరిగింది. షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీ లో విలీనంపై పార్టీ అధిష్టానం సుముఖంగా ఉన్న నేపథ్యంలో ఈ వారంలో షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
వైఎస్ షర్మిల 2021 మార్చిలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా వైఎస్ఆర్ అభిమానులు, నాయకులతో హైదరాబాద్ లో సమావేశాలు నిర్వహించిన తర్వార పార్టీ పెట్టబోతున్నట్లు తెలిపారు. అదే ఏడాది వైఎస్ఆర్ జయంతి జూలై 8న హైదరాబాద్ జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ నందు ఏర్పాటు షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతో పాటు తన పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా ప్రకటించారు. కేసిఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై వివిధ రూపాల్లో పోటారాలు నిర్వహించిన షర్మిల .. ప్రజా ప్రస్థానం పాదయాత్రను 2021 అక్టోబర్ 20న చేవెళ్ల నుండి ప్రారంభించారు. షర్మిల పార్టీ పెట్టిన కొత్తలో వైఎస్ఆర్ టీపీ .. బీఆర్ఎస్ కు బీ టీమ్ అని పలువురు, బీజేపీకి బీ టీమ్ అంటూ మరి కొందరు విమర్శించారు. అయితే తాను ఏ పార్టీకి బీ టీమ్ కాదని షర్మిల ఆనాడు చెప్పుకొచ్చారు.
వైఎస్ఆర్ హయాంలో అమలు అయిన సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. అయితే షర్మిల పార్టీకి అనుకున్నంత మైలేజ్ రాలేదు. షర్మిల పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిక వల్ల అంతిమంగా అధికార బీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిన తర్వాత అక్కడి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు షర్మిల శుభాకాంక్షలు తెలియజేయడం, రాహుల్ గాంధీకి లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన సమయంలో ఆయనకు అనుకూలంగా ట్వీట్ చేయడం తదితర చర్యలతో షర్మిల కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.
ఆ మధ్య ప్రగతి భవన్ వద్ద ఆందోళన చేయడానికి బయలు దేరిన షర్మిలను అరెస్టు చేసి కార్ లోనే క్రేన్ సహాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. ఆ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి పరామర్శించడంతో బీజేపీకి దగ్గర అవుతున్నారనే వార్తలు కూడా వినబడ్డాయి. అయితే కర్ణాటక ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు బీజేపీనా, కాంగ్రెస్ పార్టీనా అన్న సంశయంలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
చంద్రబాబుపై విజయసాయి మరో సారి ఘాటుగా.. డెల్యుజనల్ డిజార్డర్ రుగ్మత అంటూ..
Narendra Modi Biopic: సినీ ప్రియులకు బయోపిక్ చిత్రాలు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల… Read More
May 19: Daily Horoscope in Telugu మే 19 – వైశాఖ మాసం – ఆదివారం- రోజు వారి… Read More
Chandu: త్రినయని సీరియల్ లో నటించిన చందు మన అందరికీ సుపరిచితమే. ప్రజెంట్ చందు రాధమ్మ పెళ్లి, కార్తీకదీపం బంటి… Read More
Big Boss: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా బిగ్ బాస్ అంటే… Read More
Trinayani: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు… Read More
Bigg Boss Ashwini: అనేకమంది నటీనటులు బిగ్బాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందుతున్నారు. గతంలో వారు ఎవరో ప్రేక్షకులకు… Read More
Anchor Varshini: చాలామంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాకి దగ్గరగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఉంటారు. మొదట్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ… Read More
Tollywood: ప్రస్తుతం ఉన్న సీరియల్ తారలు సినిమా తారలు కంటే ఎక్కువ హాట్ గా కనిపిస్తున్నారు. సినిమాలు ఏ రేంజ్… Read More
Manasu Mamatha: ప్రజెంట్ సినీ ఇండస్ట్రీ మొత్తం వేడాకుల వ్యవహారాలతో వైరల్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు విడాకులు తీసుకుంటూ… Read More
Arvind Kejrival: లోక్ సభ ఎన్నికల తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుస ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నేతల అరెస్టు… Read More
ఏపీ సీఎం జగన్ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేసి దాడి చేశారని ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ కుమార్… Read More
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని… Read More
Telangana EAPCET: తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలైయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్… Read More
SIT: ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ చేపట్టేందుకు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి చేరుకుంది.… Read More
EC: ఏపీలో ఎన్నికల సందర్భంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పల్నాడు కలెక్టర్ తో పాటు మూడు జిల్లాల ఎస్పీలపై… Read More