టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో 1977లో సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ వాణిజ్య ఉత్పత్తి మొదలైన వెంటనే ఫస్ట్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు ప్రారంభమైందని అన్నారు. మరి చంద్రబాబు కొత్తగా తీసుకొచ్చింది ఎప్పుడు? అని ప్రశ్నించారు. ఫ్యాక్ట్ చెక్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందనీ, ఏది, ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడానికి గూగుల్ ఉందని గుర్తు చేశారు.
సొంత మీడియా ఎలాగూ బాకా ఊదుతుందని అసత్యాలను వదులుతూనే ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రతిదీ తనవల్లే సాకారమైందని నమ్మించాలని చూడటం, ప్రతి వినూత్న కార్యక్రమం వెనక తానే ఉన్నట్టు చెప్పుకోవడం సైకాలజీలో డెల్యూజనల్ డిజార్డర్ (Delusional disorder) అంటారన్నారు. చంద్రబాబు స్వీయపొగడ్తల తీరు చూస్తుంటే ఆయన ఎంతో కాలంగా ఈ భ్రాంతితో కూడిన రుగ్మతతో బాధపడుతున్నట్టు రూఢీ అవుతోందని పేర్కొన్నారు.
ఇటీవల పాదయాత్రలో నారా లోకేష్ .. టీడీపీ క్యాడర్ ను ఇబ్బంది పెట్టిన అధికారులు, నేతల పేర్లను రెడ్ డైరీలో రాస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామంటూ హెచ్చరిస్తున్న నేపథ్యంలో దానిపైనా విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. ఆ ఎర్ర డైరీల సైజు పెంచండయ్యా తెలుగు తమ్ముళ్లు! అంటూ ఎద్దేవా చేశారు. మీ మాట ఎవరూ వినకపోయినా, నిబంధనల ప్రకారం అధికారులు నడుచుకున్నా…వాళ్ల పేర్లను రాసుకుంటామని బెదిరిస్తున్నారు కదా! కిందటిసారి చిత్తుగా ఓడించిన ప్రజలు 2024 ఎలక్షన్లలో కూడా అదే తీర్పును ఇవ్వబోతున్నారని అన్నారు. కోట్లలో ఉన్న వారి పేర్లను రాసుకోవాలికదా! ఆ ఎర్ర డైరీల సైజు పెంచండయ్యా తెలుగు తమ్ముళ్లు అంటూ సెటైర్ వేశారు.
Read More: తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి సారె సమర్పించిన టీటీడీ