ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో జరిగే ఎన్నికలు సంకటంగా మారాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడ పోటీ చేస్తుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువా క నుంచి పోటీ చేసిన పవన్ ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి కచ్చితంగా విజయం సాధించాలన్న కసితో ఉన్న జనసేనాని పిఠాపురాన్ని గురి చేశారు. 80 శాతం ఓటు బ్యాంకు కాపులకు ఉన్న నేపథ్యంలో కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమా ఉంది.
ఇక, పవన్పై వైసీపీ తరఫున ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. పవన్ను ఈసారి కూడా ఓడించాలనేది వైసీపీ పెట్టుకున్న లక్ష్యం. దీనికి తగిన విధంగానే ఆమెకు అన్ని వైపుల నుంచి ఆయుధాలు అందుతు న్నాయి. అయితే.. వీరిద్దరి విషయంలో పవన్కు దిమ్మతిరిగేలా చేస్తున్నది గీత మాత్రమే కాదు.. ఆయన పేరుతో.. దాదాపు ఆయన గుర్తు గాజు గ్లాసును పోలిన గుర్తుతో ఉన్న మరో వ్యక్తులు కావడ గమనార్హం. పవన కళ్యాణ్ పేరుతో జనసేనాని కాకుండా.. మరో ఇద్దరు పోటీలో ఉన్నారు.
వారే. కోనేటి పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ఒకరు. ఈయన ఎన్నికల గుర్తు బకెట్ ఇది అచ్చంగా గ్లాసును పోలి ఉంది. ఇక, ఆరో నెంబర్లో జనసేనాని కొణిదెల పవన్ కల్యాణ్ ఉన్నారు. ఆయనకు కేటాయించిన గుర్తు గాజు గ్లాస్. ఇది పవన్కు ఒరిజినల్ గుర్తు. ఇక, ఈవీఎంపై ఉన్న ఏడో నెంబర్లో కనుమూరి పవన్ కల్యాణ్ పేరుతో ఓ వ్యక్తి నామినేషన్ వేశాడు. ఆయన కూడా ఓ గ్లాస్ గుర్తును పోలి ఉన్న పెన్ హోల్డర్(ఆఫీసుల్లో పెన్నులు.. పెన్నిళ్లు పెట్టుకునేది) గుర్తు ఉంది.
దీంతో ఈ ఇద్దరు పేర్లు, వీరి గుర్తులు కూడా. పవన్కు ఇబ్బందిగా మారాయి. ఇదే ఓటింగ్ సమయంలో అయోమయానికి గురి చేస్తుందని జనసేన పార్టీ అంచనా వేస్తోంది. ఓటు వేసేందుకు వారు గ్లాస్ గుర్తు వెతికేందుకు టైం పడుతుందని అలాంటి సమయంలో వేరే గుర్తుపై ఓటు వేసే ఛాన్స్ ఉందని వాపోతు న్నారు. అంతేకాదు.. కుదిరితే.. ఆ స్వతంత్ర అభ్యర్థులను బరి నుంచి తప్పించాలని కూడా చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.