Breaking: లోక్ సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్ డీ రేవణ్ణ ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అదుపులోకి తీసుకుంది.
పద్మనాభ నగర్ లోని మాజీ ప్రధాని హెచ్ డీ దేవగౌడ నివాసంలో రేవణ్ణ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రేవణ్ణ కు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ మంజూరునకు ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు నిరాకరించడంతో అయిదుగురు సిట్ అధికారులు దేవగౌడ నివాసానికి వెళ్లి రేవణ్ణ ను అదుపులోకి తీసుకున్నారు.
ఒక మహిళ కిడ్నాప్ వ్యవహారంలో రేవణ్ణ అరెస్టు జరిగింది. గతంలో రేవణ్ణ ఇంట్లో పని చేసిన తన తల్లి కిడ్నాప్ నకు గురైందని బాధితురాలి కుమారుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై 364 ఏ కిడ్నాప్, 364, అక్రమంగా బంధించడం వంటి సెక్షన్ ల కింద కేసు నమోదైంది.
మరో వైపు లైంగిక దౌర్జన్యం, బెదిరింపులు, లైంగిక వాంఛ తీర్చాలంటూ దాడులు, ఆ కృత్యాల చిత్రీకరణ, వాటిని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్, కిడ్నాప్ వంటి ఆరోపణలపై తండ్రీ కొడుకులపై కేసులు నమోదు అయ్యాయి. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం విదేశాలలో ఉన్న నేపథ్యంలో భారత్ కు రాగానే అతన్ని అరెస్టు చేసే అవకాశం ఉంది.
CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు