CPI Narayana: మోడీ సర్కార్ తీరుపై సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తేనే మంచిదని, అప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు జైల్ లో ఉన్నట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా జైల్ లో పెడితే మనకు మంచిదవుతుందని అన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న సీఎంలు దొంగలు అయినా వారు మంచి వారే కానీ వ్యతిరేకిస్తే మాత్రం వారిని జైల్ కి పంపిస్తారని నారాయణ మండిపడ్డారు. ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ లో మాట్లాడుతూ నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డిని కూడా జైల్ కి పంపించాలని మోడీ చూస్తున్నారని నారాయణ అన్నారు. దేశ ద్రోహం కింద మొదట అరెస్టు చేయాల్సి వస్తే మోడీని, రెండవ వ్యక్తిగా అమిత్ షా లను అరెస్టు చేయాలని నారాయణ మండిపడ్డారు. నరేంద్ర మోడీ దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని దుయ్యబట్టారు. మోడీ మూడవ సారి ప్రధాని అయి, 400 సీట్లు వస్తే భారతదేశం ఇలా ఉండదని అన్నారు. పూర్తి హిందూ దేశంగా మారుతుందని విమర్శించారు. ఇక దేశంలో ముస్లింలు అనే వారు ఉండరని, మూడవ సారి మోడీ పాలన అలా ఉంటుందని అన్నారు.
ఇదే సందర్భంలో కేసిఆర్ ను విమర్శించారు. నామా నాగేశ్వరరావును మంత్రిని చేస్తానని కేసిఆర్ అంటున్నాడని, ఆయన (కేసిఆర్)కే దిక్కులేదు నామాను మంత్రిని చేస్తాడట అని ఎద్దేవా చేశారు. ప్రతి కార్యకర్త మన అభ్యర్ధి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి రామసహాయం రఘురాం రెడ్డిన గెలిపించాలని నారాయణ కోరారు.
Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం