Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ జ్యోతిమఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసి లోక్ సభ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగాలనుకున్న వారిని వారణాసి మేయర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పోటీగా ఎవరూ ఉండకూడదని కుట్రలు జరుగుతున్నాయని స్వామిజీ పేర్కొన్నారు. నామినేషన్ వేసిన వారిని భయభ్రాంత్రులకు గురి చేస్తూ పోటీ నుండి తప్పుకునేలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అర్ధరాత్రి వేళ అభ్యర్ధుల ఇళ్లకు వెళ్లి తలుపు కొట్టి భయపెడుతున్నారని, వారణాసిలో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్నాయని స్వామీజీ ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలుగుతోందని స్వామిజీ వాపోయారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి స్థానానికి మొత్తం 43 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో వివిధ కారణాలతో ఈసీ ఏకంగా 36 నామినేషన్లను తిరస్కరించింది. గురువారం నాటికి మొత్తం వారణాసి బరిలో నిలిచిన అభ్యర్ధులు ఆరుగురు మాత్రమే.
Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే