ED Raids: సార్వత్రిక ఎన్నికల వేళ .. ఝార్ఖండ్ లోని ఓ ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఇదంతా లెక్కల్లోకి రాని సొమ్ము అని, ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న సొమ్ము రూ.20కోట్లకుపైగా ఉంటుందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వర్గాలు మీడియాకు వెల్లడించాయి.
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద రాజధాని నగరం రాంచీలోని పలు ప్రాంతాల్లో ఇవేళ (సోమవారం) ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ కేసులో జార్ఘండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేసిన మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్ ని గత ఏడాది అరెస్టు చేశారు. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఆయనకు చెందిన 10కిపైగా ప్రాంతాల్లో ప్రస్తుతం సోదాలు జరిగాయి.
ఈ క్రమంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్ అలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ వ్యక్తిగత కార్యదర్శి (పీఏ)కి చెందినదిగా భావిస్తున్న ఇంట్లో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఒక గదిలో కరెన్సీ కట్టలు పేర్చి ఉన్న దృశ్యాలు చూసి అధికారులే వీస్తుపోయారు. సంజీవ్ లాల్ దగ్గర నుండి కొంత మంది జార్ఖండ్ రాజకీయ నాయకులతో లావాదేవీల వివరాలతో కూడిన పెన్ డ్రైవ్ ను స్వాధీనం చేసుకున్నారు. వీరేంద్ర రామ్ సన్నిహితులైన వారి నివాసాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
మంత్రి పీఏ నివాసంలో భారీ ఎత్తున నగదు పట్టుబడటంపై బీజేపీ స్పందించింది. జార్ఖండ్ లో అవినీతి ముగిసిపోలేదన్నారు. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికల్లో భాగంగా సదరు వ్యక్తులు దీనిని ఉపయోగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తొందని, దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, పలు ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలకు పాల్పడ్డారని, రూ.100 కోట్ల మేర కూడబెట్టారని వీరేంద్ర పై ఆరోపణలు ఉన్నాయి.
Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా