Koratala Siva On Devara: చాలామంది ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న సినిమాలలో దేవరా కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ త్రిల్లర్ మూవీ పై భారీ హైప్స్ ఏర్పడ్డాయి. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ మూవీ పై తాజాగా కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ కొట్టిన తారక్ ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు. దీంతో ఈ మూవీ అప్డేట్ల కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల శివ దేవర అప్డేట్ ఇవ్వాలనే ప్రశ్న ఎదురవ్వగా.. దానికి ఆయన స్పందించారు. సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ చిత్రానికి కొరటాల శివ సమర్పకుడిగా ఉన్నారు. ఇక ఈ మూవీ మే 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ తరుణంలో కిష్టమ్మ మూవీ ప్రమోషన్స్ కోసం తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ పాల్గొన్నారు. అయితే దేవర గురించి అప్డేట్ చెప్పాలని ఆయనకు ఆపరేషన్ ఎదురయింది. అభిమానులు కాలర్ ఎగరేసేలా దేవర ఉంటుందని టిల్లు స్క్వేర్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ.. కొరటాల శివ ను ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్న అడిగారు. ఒక అప్డేట్ ఇవ్వాలని కోరారు. దేవర గురించి మాట్లాడడానికి చాలా టైం ఉందని.. అయితే ఎన్టీఆర్ అభిమానులకి ప్రత్యేకమైన సినిమాగా ఉంటుందని కొరటాల శివ వెల్లడించారు. ” జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. నేను ఇంతకు ముందే చాలా మాట్లాడ. ఇప్పుడు చాలా టైం ఉంది.
ఇది కచ్చితంగా నాకు అభిమానులకి చాలా స్పెషల్ మూవీ గా ఉంటుంది. అంతవరకు చెప్పగలను. ఇంకా చాలా టైం ఉంది. వరుసగా అప్డేట్లు వస్తాయి ” అంటూ చెప్పుకొచ్చాడు కొరటాల శివ. తనతో పాటు తన కృష్ణమ్మ మూవీ యూనిట్లో చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులని సత్యదేవ్ అన్నారు. కృష్ణమ్మ డైరెక్టర్ వివి గోపాలకృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ కాళభైరవ ఇలా చాలా తమ టైం లో చాలామందికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని. కృష్ణమ్మ చిత్రం మే 10న విడుదల కానుంది. ఇక ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన దేవరాజ్ సినిమా ఏకంగా అక్టోబర్ కు వాయిదా పడింది. దసరా సందర్భంగా అక్టోబర్ 10 మూవీ విడుదల కానుంది.
ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతోనే జాన్వి కపూర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర మూవీని యువ సుధా ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పథకాలు భారీ బడ్జెట్ తో నిర్మించాయి. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ టాక్ తో ఉన్న ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఇది కావడంతో మరిన్ని హైప్స్ ఏర్పడ్డాయి. ఇక ఈ పాన్ ఇండియా మూవీ హిందీ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిలిమ్స్ ఇప్పటికే భారీ ధరకు సొంతం చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు కళ్ళు చెదిరే ధరకు ఆ మూడు పోయినట్లు తెలుస్తుంది.