Pooja Hegde: గత ఏడాదిన్నర కాలం నుంచి టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను బ్యాడ్ టైం ఓ రేంజ్ లో బంతాడేస్తోంది. ఒకప్పుడు సక్సెస్ కు కేరాఫ్ గా ఉన్న పూజా హెగ్డే.. 2022 ఆరంభం నుంచి వరుస పరాజయాలతో గట్టిగా నలిగిపోతోంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అర డజన్ ఫ్లాపులు పూజా హెగ్డే ఖాతాలో పడటంతో.. గోల్డెన్ లెగ్ అన్నవారే ఆమెను ఐరన్ లెగ్ అంటూ విమర్శించారు. బ్యాక్ టు బ్యాక్ ప్లాపులు పడడం వల్ల పూజ హెగ్డే కు ఆఫర్లు కూడా బాగా తగ్గాయి. స్టార్ హీరోలు ఆమె వంక కూడా చూడడం లేదు.
ఇలాంటి తరుణంలో పూజా హెగ్డే టాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పిందని వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. కానీ ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ఆమె చేతి నుంచి జారిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ ప్రాజెక్టు మరేదో కాదు టిల్లు క్యూబ్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ తెరకెక్కించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మూవీ డీజే టిల్లు 2022లో విడుదలై ఎలాంటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీతో సిద్ధు ఓవర్ నైట్ స్టార్గా మారాడు. నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి.
దీంతో డీజే టిల్లుకు సీక్వెల్ గా ఇటీవల టిల్లు స్కేర్ మూవీని తీసుకొచ్చారు. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ డైరెక్ట్ చేయగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన టిల్లు స్కేర్ మూవీ డీజే టిల్లు ను మించి విజయాన్ని సాధించింది. ఆన్ స్క్రీన్ పై టిల్లు గాడి అల్లరిని ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేశారు. తొలి ఆట నుంచే టాక్ అనుకూలంగా ఉండటంతో టిల్లు స్కేర్ కలెక్షన్స్ కుమ్మేస్తోంది. అయితే టిల్లు స్కేర్ కు కొనసాగింపుగా టిల్లు క్యూబ్ ను చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. మ్యాడ్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన కళ్యాణ్ శంకర్ టిల్లు క్యూబ్ ని తెరకెక్కించనున్నాడని అంటున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించబోతోందని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. టిల్లు క్యూబ్ కోసం నిర్మాతలు పూజా హెగ్డేను సంప్రదించారని.. ఆమె కూడా సానుకూలంగా స్పందించని వార్తలు వచ్చాయి. ఆల్మోస్ట్ సిద్ధు జొన్నలగడ్డకు జోడిగా పూజా హెగ్డే ఫిక్స్ అని అంతా అనుకున్నారు.
కానీ టిల్లు క్యూబ్ కు పూజా హెగ్డే సైన్ చేయడానికి ముందే ఆమె హీరోయిన్ గా వద్దని సిద్ధు చెప్పాడట. పూజా హెగ్డే కన్నా యానిమల్ మూవీతో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న తృప్తి డిమ్రి హీరోయిన్ క్యారెక్టర్ కు బాగా సెట్ అవుతుందని సూచించాడట. దాంతో పూజా హెగ్డేను పక్కన పెట్టేసి తృప్తి డిమ్రితో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి డీజే టిల్లు, టిల్లు స్కేర్ సక్సెస్ లో సిద్ధు జొన్నలగడ్డ పాత్రే ఎక్కువ. టిల్లు పాత్రలో తనను తప్ప మరొకరిని ఊహించుకోలేనంత అద్భుతంగా నటించాడు. తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ ఆన్ స్క్రీన్ పై వన్ మెన్ షో చేశాడు. పైగా డీజే టిల్లు, టిల్లు స్కేర్ చిత్రాలకు హీరోగానే కాకుండా రచయితగా కూడా సిద్ధు పని చేశారు. అందువల్లే టిల్లు క్యూబ్ విషయంలో సిద్ధు సలహాలు, సూచనలు నిర్మాతలు గట్టిగా ఫాలో అవుతున్నారట.