Land Titiling Act: ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ తరణంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. పీవీ రమేష్ చేసిన పోస్టు విపక్షాల ఆరోపణలకు బలం చేకూరేలా ఉండటంతో దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అధికార, విపక్ష పార్టీల నడుమ మాటల యుద్దం జరుగుతున్న వేళ .. తాను ఇబ్బందులు పడ్డానంటూ పీవీ రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) లో #LandTitilingAct హ్యాష్ ట్యాగ్ తో ఆయన పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
‘నేను ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణాజిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్టు ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల పరిస్థతిని ఊహించలేం’ అంటూ పీవీ రమేష్ రాసుకొచ్చారు.
ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం