Iran: రాబోయే 48 గంటల్లో ఏ క్షణమైనా ఇజ్రాయిల్ పై నేరుగా ఇరాన్ దాడి చేసే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఆలీ ఖమేనీ సలహాదారు వెల్లడించారంటూ వాల్ స్ట్రీట్ కథనంలో ప్రస్తావించింది. ఇజ్రాయిల్ పై ప్రత్యక్ష దాడి చేయడం వల్ల ఎదురయ్యే పర్యవసానాలు, రాజకీయ పరమైన నష్టాలపై ఇరాన్ విశ్లేషణలు చేస్తుందని తెలిపింది.
ఇజ్రాయిల్ పై ఏ తరహా దాడి చేయాలి..ఆ దేశంలోని ఏయే ప్రాంతాలపై దాడి చేయాలి.. ఏ సమయంలో దాడి చేయాలి అనే అంశాలపై వ్యూహాలు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ముందు రెడీగా ఉన్నాయని కథనంలో పేర్కొంది. మరో పక్క ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి చేయనుందని సమాచారం రావడంతో అమెరికా అప్రమత్తం అయ్యింది. ఇజ్రాయిల్ లోని అమెరికన్లకు అడ్వెజరీ జారీ చేసింది.
కాగా, సిరియాలోని డమస్కస్ లో ఉన్న ఇరాన్ కాన్సులేట్ పై ఇజ్రాయిల్ ఈ నెల 1వ తేదీన వైమానిక దాడి చేసింది. ఆ ఘటనలో కీలకమైన సైనిక జనరల్, మరో ఆరుగురు సైనిక అధికారులు మృతి చెందారు. దీంతో ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయిల్ మద్య యుద్దం ప్రారంభమైతే పశ్చిమాసియా అగ్నిగుండంలా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్