Telangana Lok Sabha Election: ఎట్టకేలకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించింది. మారేపల్లి సుధీర్ కుమార్ ను ఎంపీ అభ్యర్ధిగా ఎంపిక చేసినట్లు పార్టీ అధినేత కేసిఆర్ ప్రకటించారు. ప్రస్తుతం సుధీర్ కుమార్ హనుమకొండ జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. శుక్రవారం ఉదయం పార్టీ నేతలతో చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపారు.
సుధీర్ కుమార్ 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ విధేయుడుగా, అధినేతతో కలిసి పని చేస్తున్నారు. దీంతో సుధీర్ కుమార్ అభ్యర్ధిత్వాన్ని వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలు స్వాగతిస్తున్నారు. తొలుత స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య పేరును కూడా పరిశీలించినట్లుగా వార్తలు వచ్చాయి.
కొద్ది రోజుల క్రితం వనపర్తి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించాలని బీఆర్ఎస్ అధినేతలు భావించారు. అయితే తాను పోటీ చేయనని చెప్పి పార్టీని వీడారు. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఆయనను బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది. ఆ తర్వాత మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యను బీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రకటించింది.
కొద్ది రోజులు ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహించిన కడియం కావ్య ఆ తర్వాత తండ్రి కడియం శ్రీహరితో కలిసి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా కావ్యను ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ వీడిన నేతలతోనే ఆ పార్టీ అభ్యర్ధి పోటీ పడునున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నుండి వరంగల్ లోక్ సభ అభ్యర్ధులుగా మాజీ బీఆర్ఎస్ నేతలే బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారు.
AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?