Janasena: జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గ్లాస్ సింబర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. గాజు గ్లాస్ గుర్తు కేటాయింపునకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) హైకోర్టుకు నివేదిక సమర్పించింది. జనసేన పోటీ చేసే ఎంపీ స్థానాల (మచిలీపట్నం, కాకినాడ) పరిధిలోని అసెంబ్లీ సీట్లలో ఇతరులకు ఆ గుర్తు కేటాయించబోమని న్యాయస్థానానికి ఈసీ తెలిపింది.
ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలగుతాయని ఈసీ అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు .. విచారణను ముగించింది.తమ పార్టీ అభ్యర్ధులు పోటీ చేయని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించొద్దంటూ జనసేన హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
మంగళవారం దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ హైకోర్టుకు తెలిపారు. ఆ మేరకు నేడు (బుధవారం) ఈసీ నివేదిక అందజేసింది.
ఈసీ నిర్ణయంతో జనసేనకు స్వల్ప ఊరట లభించినట్లు అయ్యింది. టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తొంది. అయితే గాజు గ్లాస్ జనసేన ఎన్నికల గుర్తు అని విస్తృతంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్ధులకు ఆ గుర్తు కేటాయిస్తుండటంతో కూటమి పార్టీల్లో ఆందోళన నెలకొంది.
Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్