Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలకు గానూ మహారాష్ట్రలో మరో అభ్యర్ధిని బీజేపీ ప్రకటించింది. ముంబయి నార్త్ సెంట్రల్ స్థానానికి ప్రముఖ సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికమ్ ను బరిలోకి దింపింది. ఇక్కడ వరుసగా రెండు సార్లు విజయం సాధించిన సిట్టింగ్ ఎంపీ పూనమ్ మహాజన్ ను పక్కన పెట్టి ఉజ్వల్ నికమ్ పేరును ప్రకటించింది బీజేపీ.
పూనమ్ తండ్రి ప్రమోద్ మహాజన్ హత్య కేసును ఉజ్వల్ నికమ్ వాదించారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ధారావీ ఎమ్మెల్యే వర్ష ఏక్ నాథ్ గైక్వాడ్ ను అభ్యర్ధిగా ప్రకటించింది. లోక్ సభ ఎన్నికల అయదో విడతలో భాగంగా మే 20న ముంబాయి నార్త్ సెంట్రల్ లో పోలింగ్ నిర్వహించనున్నారు.
బీజేపీ అభ్యర్ధి ఉజ్వల్ నికమ్ విషయానికి వస్తే..ఆయన 1993 ముంబాయి బాంబు పేలుళ్లు, టీ సిరీస్ మ్యూజిక్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ హత్య కేసు. 2008లో ముంబాయి దాడుల కేసుల్లో నిందితులను జైల్ కు పంపడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విశేషంగా శ్రమించారు.
అలానే 2013 ముంబాయి గ్యాంగ్ రేప్ కేసు, 2016లో కోపర్ధీ సామూహిక అత్యాచారం, హత్య కేసుల్లో ప్రత్యేక ప్రాసిక్యూటర్ గా పని చేశారు. ఆయన విశేష సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. 2017లో ఉజ్వల్ నికమ్ బయోపిక్ .. ‘అదేశ్ ది పవన్ ఆఫ్ లా’ అనే పేరుతో కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది.
YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!