AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ గురువారం (నేడు) రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నేతలు లంచ్ మోష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ లపై హైకోర్టులో సుమారు అయిదు గంటల పాటు విచారణ జరిపింది.
ఎన్నికల కమిషన్ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చి, మళ్లీ విజ్ఞప్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీంతో ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించిన ఈసీ కోర్టు ముందు సమాధానం ఇచ్చింది. జనవరి నుండి మార్చి 16వరకు వివిధ పథకాలకు బటన్ నొక్కి అప్పుడు నిధులు విడుదల చేయకుండా ఎన్నికలకు రెండు రోజుల ముందు నిధులు ఎలా విడుదల చేస్తారని ఈసీ ప్రశ్నించింది. సైలెంట్ పీరియడ్ లో నిధులు విడుదల చేసేందుకు వీలు లేదని ఈసీ స్పష్టం చేసింది. దీని వల్ల లెవల్ ఫ్లెయింగ్ ఫీల్డ్ దెబ్బ తింటుందని పేర్కొంది.
తాము ఆన్ గోయింగ్ స్కీమ్ కు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. నాలుగు రోజుల్లో పోయిందేముందని, ఈ నెల 14 న తేదీన విడుదల చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది చెప్పారు. గతంలో తాము జూన్ 6 వరకు నిధులు విడుదల చేసేందుకు వీలులేదని చెప్పినా, తాజాగా మాత్రం పోలింగ్ పూర్తైన తర్వాత విడుదల చేసుకోవచ్చని చెబుతున్నామని ఈసీ న్యాయవాది తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పను రిజర్వు చేసింది.
Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక